పోచమ్మమైదాన్, ఆగస్టు 13: స్వాతంత్య్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్ నుంచి దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ బీ గోపితోపాటు పలు సంఘాల నాయకులు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని, ఇంటింటికీ మువ్వన్నెల జెండాలను ఎగురవేసి జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్ రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద పూలమాలలు వేసి కదలిన ర్యాలీ సీకేఎం కాలేజీ వరకూ కొనసాగింది. కళాశాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ శశిధర్రావు, డైరెక్టర్ చందా విజయ్కుమార్, ఎన్సీసీ ఆఫీసర్ పీ సతీశ్కుమార్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రాంకిషన్, కార్యదర్శి గాజ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఫ్రీడమ్ ర్యాలీ చేపట్టారు. వరంగల్ 21వ డివిజన్ తిలక్రోడ్డులో ప్రభుత్వ చార్బౌళి పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ ఆధ్వర్యంలో కాశీబుగ్గ తిలక్రోడ్డు నుంచి శాంతినగర్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే, వరంగల్ ఎల్బీనగర్లోని తారకరామా వీధిలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకాలను ప్రదర్శించారు. ట్రస్ట్ సభ్యులు త్రివర్ణ పతాకాలను చేతబూని నినాదాలు చేశారు. సంఘం అధ్యక్షుడు సుంకనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోరంటల రాజు, గోశికొండ సుధాకర్, ఆనెన వెంకటేశ్వర్లు, స్వర్గం దశరథం, గాదె ప్రభాకర్, మార్గం వీరస్వామి, బైరి సారంగపాణి, బైరి మురళీకృష్ణ, మార్గం ఎల్లయ్య, బింగి మహేశ్, కోమాకుల నాగరాజు, రాము, భిక్షపతి, రవి, రాజు, మల్లేశం, పైడి, నర్సయ్య పాల్గొన్నారు. కొత్తవాడ 80 ఫీట్ల రోడ్డులోని పలు పాఠశాల విద్యార్థులు, నిర్వాహకులు ర్యాలీ కొనసాగించారు. మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజ్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
వాడవాడలా వజ్రోత్సవ ర్యాలీలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు వాడవాడలా ర్యాలీలు నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలతో నిర్వహించిన ర్యాలీలు దర్శనమిచ్చాయి. మామునూరు పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ఏసీపీ నరేశ్కుమార్ ప్రారంభించారు. 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పోశాల స్వామి, ఈదుల రమేశ్, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షఫతి, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. 32వ డివిజన్లో కార్పొరేటర్ పల్లం పద్మ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పల్లం రవి, నాగపురి సంజయ్బాబు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్ పాల్గొన్నారు. 42వ డివిజన్లో కార్పొరేటర్ గుండు చందన ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో గుండు పూర్ణచందర్, సిబ్బంది పాల్గొన్నారు. 40వ డివిజన్లో కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో, మామునూరులోని బెటాలియన్లో కమాండెంట్లు శివప్రసాద్రెడ్డి, చటర్జీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కాశీబుగ్గ 14వ డివిజన్ బాలాజీనగర్ జంక్షన్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ సులోచన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. వారి సేవలను మరువలేమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. వరంగల్ 29వ డివిజన్లో టీఆర్ఎస్ నాయకులు ప్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. కల్పలత సూపర్బజార్ వైస్ చైర్మన్ ఎండీ షఫీ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, ఎస్కే రహమాన్, మాల్వే రాజు, సతీశ్, ముజీబ్, బీంరాజ్, రాచర్ల జగన్ పాల్గొన్నారు. 24వ డివిజన్లో నిర్వహించిన ర్యాలీలో టీఆర్ఎస్ నాయకుడు ఆకుతోట శిరీష్తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నగరంలో వాడవాడలా..
వరంగల్చౌరస్తా/గిర్మాజీపేట: కుల, మత, వర్గ, వర్ణలతో తేడా లేకుండా భారతీయులందరూ ఒకే కుటుంబమని చాటేందుకు చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ అన్నారు. 36వ డివిజన్ పుప్పాలగుట్ట వాటర్ ట్యాంక్ నుంచి చేపట్టిన తిరంగా జెండా ర్యాలీని ఆమె ప్రారంభించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తిని నింపిన స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం అసువులు బాసిన సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 25వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్, 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పనానవీన్, 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో డివిజన్లలో ర్యాలీలు నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలి
దుగ్గొండి: వజ్రోత్సవాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. దుగ్గొండివ్యాప్తంగా మూడు రంగుల బెలూన్లు, జాతీయ జెండాలను చేతబూని నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. సర్పంచ్ల ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు జీపీలపై జాతీయ జెండాలతోపాటు మూడు రంగుల కాంతిని వెదజల్లే లైట్లను అమర్చారు. ఈ సందర్భంగా దుగ్గొండిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆకుల శ్రీనివాస్ బస్టాండ్ నుంచి వీధుల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలిలో మానవహారం చేపట్టారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో గోల్కొండ కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, తాసిల్దార్ సంపత్కుమార్, దుగ్గొండి రూరల్ సీఐ సూర్యప్రసాద్, ఎస్సై వంగల నవీన్కుమార్, ఎంపీవో శ్రీధర్గౌడ్, దుగ్గొండి సర్పంచ్ తోకల మంజులా నర్సింహారెడ్డి, ఎంపీటీసీ మోర్తాల రాజు, ఊరటి మహిపాల్రెడ్డి, సర్పంచ్లు లింగంపల్లి ఉమారవీందర్రావు, శారదాకృష్ణ, విద్యాసాగర్గౌడ్, మమతారాజు, యుగేంధర్, మహేందర్, ఉర్మిళా వెంకన్న పాల్గొన్నారు.
దేశభక్తిని పెంపొందించుకోవాలి
యువకులు దేశభక్తిని పెంపొందించుకోవాలని చెన్నారావుపేట వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో కేజీబీవీ విద్యార్థులతో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సై తోట మహేందర్, సర్పంచ్ కుండె మల్లయ్య, ఎంఈవో అనిల్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, నోడల్ అధికారి సృజన్ తేజ, ఫర్టిలైజర్ షాపు డీలర్స్, ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పాపయ్యపేటలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరంలో ర్యాలీని ఎంపీపీ మోతె కళావతి, ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, సర్పంచ్ మాడ్గుల కవిత ప్రారంభించారు. గురిజాలలో సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారి శ్రీలత, హైస్కూల్ హెచ్ఎం గుడిపూడి రాంచందర్రావు, వార్డు సభ్యులు ర్యాలీ నిర్వహించారు. చంద్రయ్యపల్లి, భోజ్యానాయక్తండాలో ప్రజలు, చిన్నారులు ర్యాలీలో పాల్గొన్నారు. లక్నేపల్లిలో సర్పంచ్ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, హెచ్ఎం వెంగళ మురళి పాల్గొన్నారు. ముత్తోజిపేటలో సర్పంచ్ గోలి శ్రీనివాస్రెడ్డి, నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగాయి. ముగ్దుంపురం గ్రామ పంచాయతీ కార్యాలయానికి మిరు మిట్లు గొలిపే విద్యుత్ బల్బులు ఏర్పాటు చేశారు. త్రివర్ణపు విద్యుత్ కాంతుల్లో జీపీ కళకళలాడుతుంది. నల్లబెల్లిలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, జడ్పీహెచ్ఎస్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ మాట్లాడుతూ దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాసిల్దార్ దూలం మంజుల, మండల ప్రత్యేక అధికారి జహీరొద్దీన్, ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఎస్సై నార్లాపురం రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావ్, మండల నోడల్ అధికారి రామస్వామి, కేజీబీవీ ప్రత్యేక అధికారి సునీత, ప్రజాప్రతినిధులు, కారూణ్యజ్యోతి, కేజీబీవీ విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి
దేశ స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన మహనీ యుల త్యాగాలను స్మరించుకోవాలని నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజినీకిషన్ అన్నారు. నర్సంపేటలోని పాఠశాలల విద్యార్థులు, నాయకులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. నర్సంపేట మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. అలాగే, ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జీజుల సాగర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటస్వామి, సీఐ పులి రమేశ్, నాయకులు పాల్గొన్నారు. ఖానాపురం మండలవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. భారత స్వాతంత్య్ర వీరులను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. మండలకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్ చిరంజీవి, ఉపసర్పంచ్ మేడిద కుమార్, నోడల్ అధికారి మంగ్యా, కొత్తూరులో సర్పంచ్ బూస రమా అశోక్, అశోక్నగర్లో సర్పంచ్ గొర్రె కవిత, రవి, అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, కార్యదర్శుల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. సంగెం మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, కార్యదర్శుల ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు.
సంగెంలో విద్యార్థులు, మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ కూడలిలో మానవహారం చేపట్టారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేసి జాతీయ భావాన్ని పెంపొందించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి, ఎస్సై దేవేందర్, ఎంపీడీవో మల్లేశం, ఏపీఎం కిషన్, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు. నెక్కొండమండలంలో ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగాయి. మండలకేంద్రంలో ర్యాలీని మండల ప్రత్యేకాధికారి, జేడీఏ ఉషాదయాళ్, నెక్కొండ సీఐ హతిరాం, ఎస్సై సీమ ఫర్హీన్, ఎంఈవో రత్నమాల, తహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీవో రవి, నెక్కొండ సర్పంచ్ సొంటిరెడ్డి యమున-రంజిత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వజ్రోత్సరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వీరభద్రయ్య, ఏపీఎం శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. పర్వతగిరిలోపాటు వడ్లకొండ, చింతనెక్కొండలో ప్రీడమ్ ర్యాలీలు నిర్వహించారు. ఎంపీపీ కమల పంతులు, ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్, మార్కెట్ డైరెక్టర్ శాంతిరతన్రావు, సోమేశ్వర్రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గీసుగొండ నుంచి గొర్రెకుంట క్రాస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ 15, 16వ డివిజన్లలో కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకన్న, సందీప్కుమార్, డీసీసీబీ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.