పాలకుర్తి రూరల్, ఆగస్టు 13: సీఎం కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తీజ్ ఉత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీ హెచ్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. గిరిజనులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి నృత్యం చేశారు. ఆనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బంజారాలు ప్రకృతి బిడ్డలన్నారు. గిరిజనుల సం స్కృతి, సంప్రదాయాలు గొప్పవని, వాటిని మరువొద్దన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ అని ఆయన కొనియాడారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని వివరించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను గుర్తించి నిధులు మం జూరు చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అన్నారు. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం పెద్దపీట వేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. గిరిజనుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపినా నేటికీ అమలు చేయడంలేదని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని కోరారు. తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తిలో సేవాలాల్ మహారాజ్ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హా మీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ తహసీల్దార్ లావుడ్యా పూల్ సింగ్ చౌహన్, జీసీసీ మాజీ చైర్మన్ ధరావత్ గాంధీనాయక్, తీజ్ ఉత్సవాల కో ఆర్డినేటర్ బానోత్ మహేందర్ నాయక్, లకావత్ వెంకట్, లకావత్ నాగరాజు, సురేశ్, లావుడ్యా దేవేందర్, మల్లు నాయక్, జర్పుల బాలునాయక్, ధరావత్ యాకూబ్, ఎంపీపీలు నల్లా నాగిరెడ్డి, ధరావత్ జ్యోతి, జడ్పీటీసీలు కేలోత్ సత్తెమ్మ, పుస్కూరి శ్రీనివాస్రావు, పాలకుర్తి సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్కుమార్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాం బాబు, మాజీ ఎంపీపీ భూక్యా దల్జీత్ కౌర్, కళాకారుడు భిక్షునాయక్, డాక్టర్ రవిరాథోడ్, జైసింగ్ నాయక్, కాలు నాయక్, నరేందర్ పవార్, ఎర్రబెల్లి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.