సుబేదారి, ఆగస్టు 7 : ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివా రం ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎ లాంటి అవంతరాలు తలెత్తలేదు. కమిషనరేట్ అధికారుల పకడ్బందీ ఏర్పాట్లతో పరీక్ష సాఫీగా జరిగింది. కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 42 పరీక్ష కేం ద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 21,550 మంది అభ్యర్థులకు 19,992 వేల మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లా నుంచి 9,223 మం ది, హనుమకొండ నుంచి 8,689 మంది జనగామ జిల్లా నుంచి 2,080 మంది హాజరయ్యా రు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
నిమిషం నిబంధన అమలు..
పది గంటలు కాగానే సెంటర్ ప్రధాన గేట్లకు సెంటర్ల అధికారులు దగ్గరుండి సిబ్బందితో తాళాలు వేయించారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్ నుంచి హనుమకొండలోని న్యూసైన్స్ పరీక్ష కేంద్రానికి మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని పోలీసులు వెనక్కి పంపించారు. అలాగే, నర్సంపేట, హనుమకొండ చైతన్య డిగ్రీ కళాశాల సెంటర్కు 8 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయకుండా వారు బాధతో వెనుదిరిగి వెళ్లారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ కొవిడ్ నిబంధనలు పాటించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి, డీసీపీలు అశోక్కుమార్, వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, హనుమకొండ ఏసీపీ కిరణ్కుమార్, ఇతర పోలీసు అధికారులు సెంటర్లను సందర్శించి పర్యవేక్షించారు. ప్రతి సెంటర్ వద్ద పోలీసు సిబ్బందిని నియమించారు.