ఆత్మకూరు, ఆగస్టు2: అనుమానమే పెను భూతమైంది. భార్యకు వివాహేతర సంబం ధం ఉందనే నెపంతో గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత భర్త కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన తాళ్ల హరీశ్(26)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఏటిపాక మండలం గౌరిదేవిపేటకు చెంది న పుష్పలీల(19)కు నెలన్నర క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగగా, పెద్ద మనుషులు పరిష్కరించి పుష్పలీలకు నచ్చజెప్పి హరీశ్తో కాపురానికి పంపించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం తో నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న పుష్పలతను మంగళవారం తెల్లవారుజామున గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. హరీశ్ కూడా ఇంట్లో ఉన్న పురు గుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతులు మృతి చెందారన్న వార్త గ్రామ స్తులను కలచివేసింది. విషయం తెలుసుకున్న పరకాల ఏసీపి శివరామయ్య, సీఐ గణేశ్ అక్కడికి చేరుకొని ఘటనకు గల కారణా లను కుటుంబ సభ్యు లు, బంధువుల నుంచి అడిగి తెలుసుకున్నారు. పుష్పలీల తల్లి మల్యాల శ్రీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.