ఖానాపురం, మే 6: సీఎం కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ఖానాపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ. 1.20 కోట్లతో అశోక్నగర్, బుధరావుపేట, ధర్మరావుపేటలో నిర్మించిన గోదాములను, ధర్మారావుపేటలో నిర్మించిన జీపీ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, సోనియాగాంధీ పరామర్శించారని పెద్ది గుర్తుచేశారు. అలాంటి కాంగ్రెస్ నేతలు.. నేడు రైతులు సుభిక్షంగా ఉన్నప్పటికీ రైతుయాత్రల పేరుతో సభలు నిర్వహించడం హేయమన్నారు. తెలంగాణలో సాగునీటి సమస్య తలెత్తకుండా టీఆర్ఎస్ సర్కారు చర్యలు చేపట్టడంతో కేంద్రం గోదావరి నదిపై తెలంగాణకు హక్కులు లేకుండా హరించే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే గోదావరి రివర్ బోర్డు ఏర్పాటు చేసిందన్నారు.
ఎరువులు నిల్వ చేసుకొనే అవకాశం
గోదాముల నిర్మాణంతో రైతులకు సకాలంలో అందించేందుకు ఎరువులను నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని పెద్ది అన్నారు. ధర్మారావుపేటకు మూడు నెలల్లో కిలో మీటరు సీసీరోడ్డుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయ భవనం, బుధరావుపేట, ధర్మారావుపేట గ్రామాల మధ్య బీటీరోడ్డు రెన్యూవల్ చేయిస్తామన్నారు. బాలుతండాను ప్రత్యేక జీపీగా ఏర్పాటు చేయిస్తానన్నారు. రాబోయే పల్లెప్రగతిలో ధర్మారావుపేటలో పల్లెనిద్ర చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, వైస్ ఎంపీపీ రామసాయం ఉమారాణి, ఉపేందర్రెడ్డి, డీపీవో స్వరూపారాణి, డీఎల్పీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సుమనావాణి, ఎంపీవో కైసర్, ఎంపీటీసీలు శంకర్, విజయాకర్రావు, సుభాన్బీ, సర్పంచ్లు వెన్ను శ్రుతి, పూర్ణచందర్, గొర్రె కవిత, రవి, సొసైటీ డైరెక్టర్లు అశోక్, సాంబయ్య, కుమారస్వామి, సునీత, గంగాధర రమేశ్, ముద్దంగుల రవి పాల్గొన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
నెక్కొండ: టేకులకుంటతండాకు చెందిన మాలోత్ వనిత-కిషన్నాయక్ కుమార్తె చందన వివాహం జరిగింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, నెక్కొండ ఉప సర్పంచ్ వీరభద్రయ్య, సర్పంచ్ మాలోత్ ప్రతాప్సింగ్ ఉన్నారు.