వర్ధన్నపేట, మే 3: ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే గ్రామాల వారీగా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుండడంతో రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. జిల్లాలో 163 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండిం చిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అవసరమైన గోనె సంచులు అందుబాటులో..
వాతావణంలో వస్తున్న మార్పులతో ఇప్పటికే వరి పంటను కోయించిన రైతులు నేరుగా కేంద్రాలను తీసు కువస్తున్నారు. గోనె సంచులను కూడా అవసర ము న్నంత దిగుమతి చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 95 వరకు కొనుగో లు కేంద్రాలను ప్రారంభించి వరి ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా కేంద్రాలు ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు సుమారు 3600 టార్పాలిన్లను సిద్ధంగా ఉంచారు. అలాగే ధాన్యంతో తాలు, మొరంపెళ్లలు ఉండకుండా కేంద్రాల వద్ద అధికారులు ప్యాడీ క్లీనర్లను కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయశాఖకు సంబంధిం చిన ఏఈవోలు కూడా కేంద్రాల వద్ద నిత్యం అందు బాటులో ఉంటూ ధాన్యం నాణ్యతను పరిశీలించిన తర్వాతనే తూకం వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిర్వహకులతో పాటుగా ఏఈవో లు కూడా కేంద్రాల వద్దే విధులు నిర్వర్తిస్తున్నారు.
జిల్లాలో 78వేల ఎకరాల్లో వరి సాగు
జిల్లా వ్యాప్తంగా 78,244 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో సు మారు 1.86 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు జిల్లాలో 163 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇం దులో 116 కేంద్రాలు పీఏసీఎస్లు, 47 ఐకేపీ ద్వారా నిర్వహించనున్నారు. కేంద్రం వెనుకంజ వేసినా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో అన్నదాతలు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ధాన్యాన్ని 17 శాతం లోపు తేమ వ చ్చేలా రైతులు కేం ద్రాలకు తీసుకురావా లి. తాలు, మట్టిపెల్ల లు లేకుండా తీసుకు వచ్చినట్లయితే వెంట నే కేంద్రాల నిర్వాహ కులు ధాన్యాన్ని తూకం వేయడానికి వీలవుతుంది. పొలాల వద్దే పూర్తిగా ఆరబెట్టుకొని తీసుకురావాలి. జిల్లాలో ప్ర స్తుతం 163 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇంకా అవసరమున్నా మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు. క్రమ పద్ధతిలో కేంద్రాల వద్ద విక్రయించుకోవాలి.
– మిట్టపల్లి సంపత్రావు, డీఆర్డీవో, వరంగల్