వరంగల్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకుందాం
మతతత్వ బీజేపీని నమ్మి మోసపోవద్దు
కాషాయ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి
కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం
మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
16, 17వ డివిజన్లలో జోరుగా ఎన్నికల ప్రచారం
గీసుగొండ/ వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 22 : టీఆర్ఎస్ను గెలిపించుకొని వరంగల్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆమె 16వ డివిజన్లోని గరీబ్నగర్, జాన్పాకలో అభ్యర్థి సుంకరి మనీషాశివతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. జాన్పాకలో ఓ హోటల్లో మంత్రి సత్యవతి చపాతీ చేసి ఓట్లును అభ్యర్థించారు. ఆ తర్వాత ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ మతతత్వ పార్టీ బీజేపీని నమ్మిమోసపోవద్దని, హిందూముస్లింలు కలసిమెలసి ఉంటున్న ఈ ప్రాంతంలో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో చిల్లర రాజకీయాలు చేసే నాయకులకు అవకాశమివ్వద్దని కోరారు. ప్రశాంతంగా ఉన్న వరంగల్ను చెడగొట్టాలని చూస్తున్నారని.. పార్టీలు మారే నాయకులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని ఆమె జోస్యం చెప్పారు.
ఏడేళ్లుగా వరంగల్ ప్రాంతంలో అభివృద్ధి తప్ప ఎలాంటి గొడవలు లేవని.. మనం జాగ్రత్తగా లేకపోతే గొడవలు సృష్టిస్తారన్నారు. గరీబ్నగర్వాసులకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చెరువు శిఖం భూమిని పేదలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దన్నారు. మున్సిపల్ పరిధిలోని పరకాల నియోజకవర్గంలో ఉన్న మూడు డివిజన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. త్వరలో టెక్స్టైల్ పార్కు పూర్తయితే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందిస్తున్ననట్లు తెలిపారు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా, పింఛన్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం కేసీఆర్ ప్రతి బడ్జెట్లో వరంగల్కు రూ.300 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివన్నారు. పేదలకు అండగా నిలుస్తు వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. గరీబ్నగర్వాసులకు ఇండ్ల పట్టాలు ఇచ్చామని అలాగే డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిస్తామన్నారు. పేదల కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.
ఇవి కూడా చదవండి
మార్కెట్ శక్తులకు అనుకూలంగా కొవిడ్-19 వ్యాక్సిన్ వ్యూహం : దీదీ
విజయ్-పూజాహెగ్డే మూవీ కీ అప్డేట్