ప్రభుత్వ వైద్యంతోనే కోలుకున్నా..
‘ఎంజీఎం’లో సేవలు బాగున్నాయి
కొవిడ్ను జయించిన భూపాలపల్లివాసి మనోగతం
కృష్ణకాలనీ, మే 12: ‘నాకు పునర్జ న్మనిచ్చింది సర్కారు దవాఖానే.. ప్రభు త్వ వైద్యంతోనే కరోనా నుంచి బయట పడ్డా.. ఎంజీఎం ఆస్పత్రిలో సేవలు బాగున్నాయి’ అని కొవిడ్ను జయించిన భూపాలపల్లివాసి గోగు రమేశ్ తన మనోగతాన్ని వెల్లడించాడు. ఆయన మాటల్లోనే.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి జలుబు, దగ్గు వచ్చి కరోనా లక్షణాలు కనబడడంతో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్ రావడంతో వైద్యుడు డాక్టర్ రవికుమార్ సలహతో హోం క్వారంటైన్లో ఉంటూ ఐదు రోజులు మందులు వాడా. కొంచెం తగ్గు ముఖం పట్టింది. ఆరో రోజు ఆక్సిజన్ అందక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో వెంటనే డాక్టర్ రవికుమార్ను ఫోన్లో సంప్రదించగా ఆయన వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు రెఫర్ చేశాడు. అక్కడికి చేరుకోగానే వైద్యులు తోబుట్టువుల్లా చేరదీసి ఆక్సిజన్ పెట్టి వైద్యం చేశారు. నర్సులు, వైద్య సిబ్బంది ఆత్మీయుల్లా మనోధైర్యం కల్పించా రు. మంచి ఆహారం అందించిన్రు. దీంతో క్రమక్రమంగా కోలుకున్న. ఇంటికి వచ్చి భార్య, పిల్లలను చూస్తాననుకోలేదు. సీఎం కేసీఆర్కు, ప్రభుత్వ దవా ఖాన వైద్యులకు రుణపడి ఉంటా. డాక్టర్లకు, సిబ్బందికి ధన్యవాదాలు.