పర్వతగిరి : గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో పల్లెప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విధిగా ప్రజలు చెత్తను బయట వేయకుండా చూసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలు నిబంధనలకు అనుగుణంగా పనులకు వచ్చేలా చూడాలని, హాజరుశాతం మెరుగ్గా ఉండాలన్నారు.
హరితహరంలో నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డీపీవో ప్రభాకర్, ఎంపీడీవో చక్రాల సంతోశ్ కుమార్, ఎంపీవో మధుసూదన్, ఏపీవో సుశీల్ కుమార్, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.