కరీమాబాద్, ఆగస్టు 12: దళితబంధు పథకంలో లబ్ధి పొందిన వారు ఆర్ధికాభివృద్ధి సాధించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. పర్వతగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన లబ్ధిదారుడు జేరిపోతుల కార్తీక్ కరీమాబాద్లో ఏర్పాటు చేసుకున్న సూపర్మార్కెట్ను శుక్రవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ దళితబంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల పక్షపాతి అన్నారు. దళితులు టీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన్య ధ్యేయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలి
వర్ధన్నపేట: యువతీ యువకులు కేవలం ఉద్యోగాల సాధన పైనే కాకుండా స్వయం ఉపాధి పొందేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లందలో యువకులు ఏర్పాటు చేసుకున్న మోడ్రన్ రైతు చికెన్ బజార్(ఎంఆర్సీబీ) ను అరూరి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకు రుణాలు అందిస్తున్నదని తెలిపారు. నిధులు, నియామకాలు, నీళ్లు అనే అంశాలపై కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మూడు అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని వివరించారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేశారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, సామాజికవేత్త టీ సత్యనారాయణరావు, టీఆర్ఎస్ నాయకులు సమ్మెట యాదగిరి, ఎల్లస్వామి, కస్తూరి అరున్, వేణుగోపాల్రావు పాల్గొన్నారు.