వరంగల్, ఆగస్టు11 (నమస్తే తెలంగాణ) : మురికివాడల పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వరంగల్ నగ రంలో మూడు బస్తీ దవాఖానలను మంజూరు చేసింది. వీటిని క్రిస్టియన్కాలనీ, గిరిప్రసాద్నగర్, బీఆర్ నగర్ కాలనీల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్రిస్టియన్కాలనీ, గిరిప్రసాద్నగర్లో పనులు తుది దశకు చేరాయి. బీఆర్నగర్ బస్తీ దవాఖానను రాజీవ్ గృహకల్పలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరలో బస్తీ దవాఖానలను ప్రజలకు అందుబా టులోకి తెచ్చేలా ముందుకెళ్తున్నారు. ప్రతి బస్తీ దవాఖానలో వైద్యుడు, స్టాఫ్ నర్స్, సిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు. బస్తీ దవాఖానల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు పరీక్షలు చేసి మందులు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు.
వైద్యా నికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవ లను అందు బాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. సర్కారు దవాఖానలన్నింటినీ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే పనిలో ఉంది. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో అవసరమైన వసతులను సమకూ ర్చుతోంది. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టుల ను భర్తీ చేస్తోంది. ఆధునాతన పరికరాలను అందుబా టులోకి తెస్తోంది. ప్రధానంగా జనం ప్రైవేట్ ఆస్పత్రు లను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్స హిస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ ప్రసవం చేసే వైద్య బృందానికి రూ.3 వేల ఇన్సెంటివ్ కూడా ఇవ్వనున్నట్లు తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. వ్యయ ప్రయాసాలు తగ్గించేందుకు కొత్తగా టెలీ మెడిసిన్ సేవలనూ అమల్లోకి తెచ్చింది.
దీంతో పెద్దాస్ప త్రులకు దూరంగా ఉన్న పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు తమ ఇంటి నుంచే ఫోన్, వీడియో కాల్ ద్వారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఎంజీఎం వంటి ఆస్పత్రి లోని ప్రత్యేక వైద్య నిపుణుల సాయం పొందుతు న్నారు. దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కి చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ఆయా పీహెచ్సీ పరిధి లోని కొన్ని సబ్ సెంటర్ల స్థాయిని పెంచింది. వీటిని పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేసింది. ప్రతి పల్లె దవాఖాన లో వైద్యుడు, స్టాఫ్ నర్సుతో పాటు సిబ్బందిని నియమించింది. ఇలా జిల్లాలో 33 పల్లె దవాఖానల ను ఏర్పాటు చేసింది. ఫలితంగా ప్రభుత్వ వైద్యం గ్రామీణ ప్రజల ముంగిట్లోకి వచ్చింది. ఈ క్రమంలో పట్టణాలు, నగరాల్లో కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్(యూపీహెచ్సీ)లకు దూరంగా ఉన్న స్లమ్ ఏరియాల్లోని ప్రజల కోసం బస్తీ దవాఖానలను నెలకొ ల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల మూడు బస్తీ దవాఖానలు మంజూరు చేసింది.
ఆ మూడు ఎక్కడంటే..
వరంగల్కు మంజూరైన మూడు బస్తీ దవాఖానల ను ఇక్కడి స్లమ్ ప్రాంతాలైన క్రిస్టియన్కాలనీ, గిరి ప్రసాద్నగర్, బీఆర్నగర్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో క్రిస్టియన్కాలనీ బస్తీ దవాఖానను స్థానికంగా ఉన్న కమ్యూనిటీహాల్, గిరిప్రసాద్నగర్ బస్తీ దవాఖాననూ స్థానికంగా ఉన్న కమ్యూనిటీహాల్లో నిర్వహించేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్యుడు, స్టాఫ్ నర్స్తో పాటు సిబ్బంది విధులు నిర్వహించేందుకు అనువుగా బస్తీ దవాఖానలను తీర్చిదిద్దుతున్నారు. క్రిస్టియన్కాలనీ, గిరిప్రసాద్నగర్ బస్తీ దవాఖానల ఏర్పాట్లు తుది దశకు చేరాయి. దాదాపు ఈ రెండు బస్తీ దవాఖానలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. బీఆర్నగర్ బస్తీ దవాఖానను స్థానికంగా ఉన్న రాజీవ్ గృహకల్పలో నిర్వహించేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
సాధ్యమైనంత త్వరలో బస్తీ దవాఖానలను ప్రజలకు అందుబాటు లోకి తేవాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే వెంకటరమణ గత కొద్ది రోజు ల్లో రెండుసార్లు క్రిస్టియన్కాలనీ, గిరిప్రసాద్నగర్, బీఆర్నగర్ సందర్శించి బస్తీ దవాఖానల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్రిస్టియన్ కాలనీ, గిరిప్రసాద్నగర్ బస్తీ దవాఖానల ఏర్పాటు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండింటిలోనూ మిగులు పనులను రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆయన జీడబ్ల్యూఎంసీ అధికారులకు చెప్పా రు. బీఆర్నగర్ బస్తీ దవాఖాన ఏర్పాటు పనులనూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, ఈ మూడిం టిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే పనిలో ఉన్నా మని డీఎంహెచ్వో పేర్కొన్నారు. ప్రతి బస్తీ దవాఖాన లో వైద్యుడు, స్టాఫ్ నర్స్, సిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని వెంకటరమణ చెప్పారు. ఈ బస్తీ దవాఖానల ప్రారంభంపై కలెక్టర్ నిర్ణయం తీసుకుం టారని ఆయన తెలిపారు. ఇప్పటికే వరంగల్ లో ఏడు యూపీహెచ్సీలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి.