రాయపర్తి, ఆగస్టు 10 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో సబ్బండ వర్గాల ప్రజలు విధిగా భాగస్వాములై జయప్రదం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రజలందరూ అనుభవించాలని ఆకాంక్షించారు. రాయపర్తి మండలం ఆరెగూడెం మినీ బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఫ్రీడమ్ పార్కును కలెక్టర్ బీ గోపీ, అటవీశాఖ అధికారి అర్పన, సర్పంచ్ రజనీసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇక్కడ ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఈ నెల 22 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వేడుకల నిర్వహణలో తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు.
వేడుకల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వ్యక్తులు, సంస్థలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫ్రీడమ్ పార్కులో మొక్కలు నాటి నీళ్లు పట్టారు. చిన్నారులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జాతీయ పతాకాలతో పార్కు చుట్టూ ‘జై భారత్-జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బానోతు హరిసింగ్, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహ నాయక్, తాహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోతు కిషన్నాయక్, ఎంపీవో తుల రాంమోహన్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, ఏపీఎం పులుసు అశోక్కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సత్యవతి, విజయలక్ష్మి, పూస మధు, సర్పంచ్, ఎంపీటీసీలు చిలుముల ఎల్లమ్మ యాకయ్య, గుగులోతు సుందర్నాయక్, బానోతు శ్వేత సుభాష్నాయక్, కర్ర సరిత రవీందర్రెడ్డి, యాకయ్య, ఎల్లయ్య, కరుణాకర్, ముత్తడి సాగర్రెడ్డి, మొలుగూరి పున్నమయ్య, అలుగోజు రమేశ్, జలగం మల్లయ్య, మహ్మద్ అష్రఫ్ పాషా, సత్తూరి నాగరాజు, ఎల్లస్వామి, పంచాయతీ కార్యదర్శులు ఒడపల్లి రాజు, గుగులోతు అశోక్నాయక్, మడిపెద్ది శివకుమార్, రాకేశ్, గోక రాజశేఖర్, బెట్టపల్లి రాకేశ్, భరత్కుమార్, నిమ్మల రాజు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.