మహబూబాబాద్ రూరల్, ఆగస్టు3: శివసత్తులు బోనమెత్తి అమ్మవారికి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం సందర్భంగా మహబూబాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో బుధవారం తల్లికి బోనాలు సమర్పించారు. జర్నలిస్టుల కాలనీ, పత్తిపాక ఏరియా నుంచి హిజ్రాలు నృత్యాలు చేస్తూ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. కోర్టు ఆవరణలోని ముత్యాలమ్మ ఆలయంలో భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లాపాపలను చల్లంగ చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ఆయురారోగ్యాలు కల్పించాలని తల్లిని వేడుకున్నారు. కార్యక్రమంలో బట్టు వర్ష, అను, హరిణి, పద్మ, వీరన్న, పావని, రాణి, ధరణి తదితరులు పాల్గొన్నారు.