వెంకటాపూర్, జూలై 15: మరో రూ. 3 కోట్లతో రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత ఎస్ కుమారి అన్నారు. ఆలయంపై తప్పుడు కథనాలు రాయవద్దని సూ చించారు. భారీ వర్షాల వల్ల ఆలయం లీకేజీ అవుతున్నదని కొన్ని పేపర్ల లో కథనాలు రాయగా, ప్రొఫెసర్ పాండురంగారావు, కేంద్ర పురావస్తు ఇంజి నీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయం పైకఫ్పు భాగంలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా అని పరిశీలించారు. యునెస్కో గుర్తింపులో మీడియా కృషి కూడా ఉందని, ఏమైనా పొరపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావా లని సూ చించారు. మరో రూ. 3 కోట్లతో తూర్పు వైపున గార్డెన్, అంత ర్గత రహదారులు, కామేశ్వరాలయ పునర్నిర్మాణం, ఆగ్నేయ దిశలో ఉన్న 3 ఉప ఆలయాలతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొం దించి, టెండర్లు ఆహ్వానించామని అన్నారు. ప్రొఫెసర్ పాండురంగారావు మాట్లాడుతూ రెండు రోజులుగా కొన్ని పేపర్లలో వస్తున్న కథనాలపై రామ ప్పను కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో కలిసి పరిశీలించామన్నారు.