హనుమకొండ, జూలై 6: కాకతీయుల వైభవం ఉట్టి పడేలా వారు చేసిన పనులు టెంపుల్, ట్యాంక్స్, టౌన్ (టీటీటీ) గురించి కవి సమ్మేళనం జరుగాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాకతీయ వైభవ సప్తాహం సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించే అంశంపై కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కవులు రచయితలతో చీఫ్ విప్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, అందులో భాగంగా కాకతీయుల వైభవ సప్తాహంతో వారి ఘనచరిత్ర గురించి కవి సమ్మేళనం నిర్వహించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులుగా కవులు బన్న అయిలయ్య, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాసరావు, రమాదేవి, అసానాల శ్రీనివాస్, గుల్షన్, బిల్లా మహేందర్ ఉన్నారని పేర్కొన్నారు.
అనంతరం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మాట్లాడుతూ 8వ తేదీన అంబేదర్ భవన్లో ఉదయం 10.30 గంటలకు కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, ఐ అండ్ పీఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జి.లక్ష్మణ్కుమార్, కవులు రచయితలు కళాకారులు పాల్గొన్నారు.