పలిమెల, జూలై 28 : జయశంకర్ భూపాలపల్లి పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగే కృష్ణవేణి (18) చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. నీట్లో ఆశించిన ర్యాంక్ రాకపోవడంతో కృష్ణవేణి సోమవారం గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని ప్రైవేట్ దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.