పోచమ్మమైదాన్, జూలై 4: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 22వ డివిజన్కు చెందిన పలు పార్టీల నాయకులు సుమారు 50 మంది మావురపు విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పోచమ్మమైదాన్లోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో సోమవారం జరిగిన సమావేశంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.
‘దళితబంధు’ షాపులకు ప్రారంభోత్సవం..
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం వల్ల దళితులకు జీవననోపాధి లభిస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. పోచమ్మమైదాన్ ఏరియాలోని పలు డివిజన్లకు చెందిన నలుగురు దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న షాపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకంతో దళితుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ జోషి, దిడ్డి కుమారస్వామి చింతాకుల అనిల్, కావటి కవిత, నాయకు లు మావురపు విజయభాస్కర్రెడ్డి, చింతాకుల సునీల్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, పోచమ్మమైదాన్కు చెందిన మైస మొగిలి సెంట్రింగ్ షాపు, అంబాల మహేశ్ టెంట్ హౌజ్, దేశాయిపేటలో జన్ను దయాకర్ కిరాణా షాపు, పోచమ్మమైదాన్లో సురేశ్ టెంట్ హౌజ్ ఏర్పాటు చేసుకోగా, ఎమ్మెల్యే ప్రారంభించారు.