రాయపర్తి, జూలై 4: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టిన రోజు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలోని గ్రామాలు, పల్లెలు, జనావాసాలు, గిరిజన తండాలు, దళిత వాడల్లోని సబ్బండ వర్గాల ప్రజల మంతి ఎర్రబెల్లి పుట్టిన రోజు వేడుకల్లో భాగస్వాములయ్యారు. మండలంలోన్ని గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ, రైతుబంధు సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు.
మండల కేంద్రంలో పండుగ వాతావరణం
మండల కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారికి ఇరువైపులా మంత్రి ఎర్రబెల్లి అభిమానులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో మండల కేంద్రం గులాబీ మయమైంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 15 కిలోల కేక్ కట్ ఏర్పాటు చేయగా, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, సర్పంచ్ గారె నర్సయ్య, మండల నాయకులతో కలిసి కేక్కట్ చేశారు.
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్రావు హాజరై పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో మొ క్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎం నర్సింహ్మానాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, మండల నాయకులు గారె నర్సయ్య, పూస మధు, కర్ర సరిత రవీందర్రెడ్డి, లేతాకుల సుమతీయాదవరెడ్డి,
చిన్నాల తారాశ్రీ రాజబాబు, మందాడి సుదర్శన్రెడ్డి, గట్టు నర్సింహ్మాచార్యులు, వల్లెపు వెంకటేశ్వర్లు, గజవెల్లి అనంత ప్రసాద్, బోనగిరి ఎల్లయ్య, నలమాస సారయ్య, బానోత్ పద్మరవినాయక్, బానోత్ భధ్రూనాయక్, కోదాటి దయాకర్రావు, మునావత్ సుజాత, నేతావత్ కిషన్నాయక్, కందికట్ల స్వామి, కుక్కల భాస్కర్, గుగులోత్ సుందర్నాయక్, బానోత్ వెంకట్రాంనాయక్, పెండ్లి రజినీసుధాకర్రెడ్డి, అండ్రెడ్డి యాదమ్మ, చెడుపాక కుమారస్వామి, మునావత్ అమ్మి మాంజ్యానాయక్, కుంచారపు హరినాథ్, చిన్నాల వనజ లక్ష్మీనారాయణ, చిలుముల్ల ఎల్లమ్మయాకయ్య, యాకమ్మ ఎల్లయ్య, గూడెల్లి శ్రీలత శ్రీనివాస్, డీ కమలమ్మవెంకన్ననాయక్, చిట్యాల వెంకటేశ్వర్లు, తిరుమల మాడభూషణ రంగాచార్యులు, వంగాల నర్సయ్య, గజ్జి శ్రీనివాస్, తోట నర్సింగం పాల్గొన్నారు.
అంధుల పాఠశాలలో ..
పోచమ్మమైదాన్: మంత్రి ఏర్రబెల్లి దయాకర్రావు జన్మదిన వేడుకలను వరంగల్ కొత్తవాడ, ఆటోనగర్లోని లూయీస్ ఆదర్శ అంధుల పాఠశాలలో సోమవారం నిర్వహించారు. తెలంగాణ జాగృతి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి మడిపల్లి సుశీల్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసి, పండ్లను పంపిణీ చేశారు. నాయకులు జూలూరీ నైనేశ్ గౌడ్, దేవరకొండ పరమేశ్వర్, మస్కుల శివకుమార్, కత్రోజు నరేశ్, జూలూరీ రాజు గౌడ్, పీ ప్రశాంత్, రాజేశ్, సాయి పాల్గొన్నారు.
అలంకానిపేటలో ఇంటింటా మొక్కల పంపిణీ
నెక్కొండ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని అలంకానిపేట సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ గుంటుక నర్సయ్య, వార్డుసభ్యులు చీకటి యాకలక్ష్మి, ఉపేందర్, ఆకుల ఉషారాణి, వెంకన్న, శోభారాణి పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి: మంత్రి జన్మదినం వేడుకలను పురస్కరించుకుని పల్లెప్రకృతివనంలో సర్పంచ్ మేకల లక్ష్మి మొక్కలు నాటారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జన్మదిన వేడుకలు మండలంలోని లెంకాలపెల్లి, కొండాపూర్,గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, కార్యదర్శులు రజిత, ప్రశాంత్ పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జన్మదిన వేడుకలు సోమవారం సంగెంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎంపీటీసీలు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కేక్కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపీపీ కళావతి , జడ్పీటీసీ గూడ సు దర్శన్రెడ్డి, నరహరి,వైస్ ఎంపీపీ బుక్క మల్ల య్య, ఎంపీడీవో మల్లేశం, ఈవోపీఆర్డీ కొమురయ్య, పీఆర్ ఏఈ రమేశ్,సొసైటీ చైర్మన్లు వేల్పుల కుమారస్వామియాదవ్, సంపత్గౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గిర్మాజీపేటలో..
గిర్మాజీపేట: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ చౌరస్తాలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీహరి కేక్కట్ చేశారు. శ్రీను, ప్రభాకర్, నితిన్రెడ్డి, శివపటేల్, రాంచందర్, శివకుమార్, జాస్వా, మధు, రాజయ్య తదితరులున్నారు.