హనుమకొండ, జూలై 3;కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటేలా ఈ నెల 7 నుంచి వారం పాటు ‘కాకతీయ వైభవ సప్తాహాన్ని’ ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర గిరిజన, ్రస్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, షెడ్యూల్, తదితర కార్యక్రమాలపై ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, పర్యాటక సాంసృతిక శాఖ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని, ఇందుకోసం రూ.50లక్షలు కేటాయించామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటుచేసి రోజువారీ ప్రణాళిక రూపొందించాలని సూచించిన మంత్రి.. ఇందులో ప్రతి ఒక్కరినీ భాగస్వామి చేస్తూ సమన్వయంతో పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
కాకతీయులది ప్రజారంజకమైన పాలన అని, వారి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ నెల 7వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు కాకతీయ సప్తాహాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారని గిరిజన, ్రస్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, షెడ్యూల్, కార్యక్రమాలపై ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సన్నాహక సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పర్యాటక, సాంసృతికశాఖ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని.. సీఎం ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయ వంతం అవుతుందన్నారు. కాకతీయ రాజులు ప్రజల కోసం చేసిన గొప్ప పనులను తలుచుకోవడం మన బాధ్యత అని చెప్పారు.
కార్యక్రమాల నిర్వహణలో భాగంగా అందరి సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాకతీయుల సామ్రాజ్యంతో అనుబంధం ఉన్న ప్రతి ఒకరూ వారి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్సవాల కోసం సాంస్కృతిక శాఖ నుంచి రూ.50లక్షలు కేటాయించామని, కార్యక్రమాల నిర్వహణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామిని చేసేందుకు జిల్లాస్థాయిలో కమిటీలు వేసి రోజువారీ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించాలన్నారు. 700 సంవత్సరాల తర్వాత కాకతీయ వంశస్తులు వారి జన్మభూమికి వస్తున్న సందర్భంగా గొప్పగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాకతీయుల చరిత్రపై అవగాహన ఉన్న వారిని కూడా భాగస్వాములు చేయాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందన్నారు. కాకతీయుల చరిత్రను ఒక డాక్యుమెంటరీగా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. కాకతీయ సప్తాహానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా పండగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.
ఘనంగా నిర్వహిస్తాం..
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. టూరిజం, కల్చరల్, మున్సిపల్ కార్పొరేషన్.. సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతం చేస్తామన్నారు. హనుమకొండ జిల్లాలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు స్థల సమస్య ఉందని, అయినప్పటికీ రెండు మూడు రోజుల తర్వాత పబ్లిక్ గార్డెన్లోని టౌన్హాల్లో ఏర్పా టు చేస్తామని చెప్పారు. నిట్, కేయూ, కేఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు చీఫ్ విప్ సూచించారు. ప్రజాప్రతినిధులు సూ చించినట్లు షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిపారు.
కాకతీయ వైభవ సప్తాహానికి వస్తున్న కాకతీయుల 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ ముందుగా భద్రకాళీ అమ్మవారి దర్శనం అనంతరం వరంగల్ పోచమ్మైదాన్లోని రాణీరుద్రమదేవి విగ్రహం వద్దకు వెళ్లనున్నందన అక్కడ కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా ఏడు రోజుల పాటు కార్యక్రమాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కాకతీయులు విస్తరించిన ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. హనుమకొండ తర్వాత ఖిలా వరంగల్లోనే ఎకువగా కాకతీయ కళావైభవాలు, చరి త్ర, కాకతీయ తోరణం, శిల్పాలు ఉన్నందున అక్కడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 10న ఖిలా వరంగల్లో ఉత్సవాలు జరుపుకొనేందుకు తమకు ప్రత్యే క అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఎమ్మె ల్సీ కడియం కడియం శ్రీహరి మాట్లాడుతూ కాకతీయుల పాలన, కళావైభ వం గురించి మనం ఎకువగా మాట్లాడుకుంటామని, వారి గొప్ప చరిత్ర ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
ప్రతి రోజూ జరిగే ఒక్కో కార్యక్రమానికి ఒక్కో వీఐపీని అతిథిగా పిలిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాకతీయులు చేపట్టిన ఎన్నో గొప్ప కార్యక్రమాలు, వారి వంశ వృక్షాన్ని, సామ్రాజ్య విస్తరణ గురించి ఛాయాచిత్ర ప్రదర్శనల ద్వారా అందరికీ తెలి యజేయాలన్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రచారం ఎక్కువగా చేయాలని కడియం శ్రీహరి కోరారు. కాకతీయుల కళాతోరణాన్ని రాష్ట్ర చిహ్నంలో చేర్చిన ఘనత సీఎం కేసీఆర్దని అన్నారు. కాకతీయ సప్తాహం పేరుతో కాకుండా కాకతీయ వైభవ సప్తాహం పేరుతో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.
పండు గ వాతావరణం ఉండేలా కార్యాచరణ ఉండాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా కార్యక్రమలుండాలని సూచించారు. కాకతీ య సామ్రాజ్యం విస్తరించిన ప్రతీచోటా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఖిలా వరంగల్లోని 17 చారిత్రక ప్రాంతాలకు లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణకు కార్పొరేషన్పరంగా అన్ని విధా లా సహాయ సహకారాలు అందిస్తామని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ఏడు రోజులు చేపట్టే కార్యక్రమలను ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించాలని ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. కళాకారులను, కవులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు.
అందరికీ తెలిసేలా..
కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలను ప్రపంచానికి తెలిసేలా ఘనంగా నిర్వహించాలనేది ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక, సాంస్కృతిక శాఖ సెక్రటరీ సందీప్కుమార్సుల్తానియా అన్నారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని ఏర్పాట్లలో ఎక్కడా తేడా లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. అందరి సూచనలు, సలహాలు తీసుకొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. మిగిలిన కలెక్టర్లు, హనుమకొండ కలెక్టర్ను సమన్వయం చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణతో విడదీయరాని బంధం
కాకతీయలు, తెలంగాణకు విడదీయరాని బంధం ఉందని భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. కాకతీయుల వైభవాన్ని, తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలు దోహదపడుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రేరణ ఆనాటి కాకతీయుల గొలుసుకట్టు చెరువుల నిర్మాణమేనన్నారు. కాకతీయ ప్రభువుల వారసుడికి 111మంది పేరిణి కళాకారులతో స్వాగతం పలుకనున్నామన్నారు. కమల్చంద్ర భంజ్దేవ్ వరంగల్ కోట సందర్శన నేపథ్యంలో ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన, బోనాలతో స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాకేంద్రాల్లో కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, డాక్టర్ గోపి, శశాంక, కృష్ణ ఆదిత్య, శివలింగయ్య, భవేశ్మిశ్రా, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, టూరిజం కార్పొరేషన్ ఎండీ మనోహర్, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, సంపత్రెడ్డి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.