గూడూరు, జూలై 3 : భీమునిపాదం జాలువారుతున్నది. గత రెండు నెలలుగా చుక్క నీరులేక బోసిపోయిన జలపాతం ప్రస్తుతం విస్తారంగా వానలు పడుతుండడంతో జలకళతో కళకళలాడుతున్నది. మండలంలోని సీతానగరం గ్రామ పరిధి కొమ్ములవంచ అటవీప్రాంతంలో సుమారు 70 అడుగుల ఎత్తులో పెద్దపెద్ద బండరాళ్లపై నుంచి సన్నని ధారలా జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటున్నది. ఆదివారం సెలవు రోజు కావడంతో వందలాది కుటుంబాలు తరలివచ్చి జలపాతం అందాలను ఆస్వాదించాయి. సెల్ఫీలు దిగుతూ, ఈత కొడుతూ ఎంజాయ్ చేశాయి.