హనుమకొండ, జూన్ 29 : కాకతీయ జూపార్కులోని నాలాను శుభ్రం చేసి వరద నీరు సాఫీగా వెళ్లేందు కు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాసర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆయన జూపార్ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. నగరీకరణ తర్వాత ఈ ప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగించామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాను శుభ్రం చేయాలని, అవసరమైతే వెడల్పు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
జూపార్కులోని జంతువులు, పక్షులను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని డీఎఫ్వోను ఆదేశించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ బడ్జెట్ కింద 10శాతం నిధు లు కేటాయించిందన్నారు. పారులో పచ్చదనం పెం చేందుకు మొకలు నాటాలన్నారు. మేయర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలో పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలను ఏర్పాటు చేశామని తెలిపారు.
నగరంలో ఓపెన్ స్పేస్లు, లే ఔట్ స్పేస్లను గుర్తించి మొకలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జూపార్కులోని నాలాను క్షేత్ర స్థాయిలో గుర్తించి విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2020లో భారీ వరదలు వచ్చినప్పుడు జూ పార్ కూడా నీట మునిగిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని, మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్వో నాగభూషణం, సిటీ ప్లానర్ వెంకన్న, ఎఫ్ఆర్వో సృజన కుమారి, ఈఈ బీఎల్ శ్రీనివాసరావు, డీఈ సంతోష్, సుష్మ, రాందాస్, బీట్ ఆఫీసర్లు మమత, శారద, సురేశ్ పాల్గొన్నారు.