పరకాల, జూన్ 29 : లక్ష్యంతో చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని మయూరి గార్డెన్స్లో చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ ముగింపు సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుతో కలిసి చల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఉద్యోగాలు సాధించేందుకు కోచింగ్ ఇప్పించామన్నారు.
ఉచిత స్టడీ మెటీరియల్నూ అందించినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలే లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ఇప్పుడు నియామకాల ప్రక్రియ మొదలైందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిరుద్యోగి ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, గ్రీన్ఉడ్ విద్యా సంస్థల నిర్వాహకుడు భరద్వాజ్ నాయుడు, పరకాల మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితారామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు వీల్చైర్ల పంపిణీ..
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే చల్లా అ న్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ మండలాల దివ్యాంగులకు ఎమ్మెల్యే వీల్చైర్లు, వాకర్లు, చేతికర్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీడీపీవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.