కరీమాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దని వరంగల్ 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. కార్యక్రమంలో పోశాల స్వామి, ఈదుల రమేశ్, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి, పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలుకాలి
పోచమ్మమైదాన్: ప్రతి ఒకరూ ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలుకాలని 21వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ కోరారు. వరంగల్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి ఉన్నత పాఠశాలలో ఆయన ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జ్యూట్ బ్యాగులు వాడాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడితే రూ. 500, సంస్థలకు రూ. 5000 జరిమానా విధిస్తారని శానిటరీ ఇన్స్పెక్టర్ ధరమ్సింగ్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ సూపర్వైజర్ సాంబ య్య, హెచ్ఎం టీ కవిత, స్థానికులు గంగాధర్, సమ్మక్క, అనిల్కుమార్ పాల్గొన్నారు. అలాగే, 22వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజు కుమారస్వామి ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ నుంచి సీకేఎం కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్లస్వామి, జవాన్లు గోల్కొండ కుమారస్వామి, సాంబయ్య, పిండి శివ, మంద దయాకర్, కొమ్మ దాసు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం..
దుగ్గొండి: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నాచినపల్లి సర్పంచ్ పెండ్యాల మమతారాజు పిలుపునిచ్చారు. జడ్పీహెచ్ఎస్, కల్పనా చావ్లా సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడొద్దన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం దుర్గాప్రసాద్, సైన్స్ క్లబ్ కోఆర్డినేటర్ సుమలత, ఉపాధ్యాయులు వెంకట్రావు, శ్రీనివాస్, మాధవి, కరమ్చంద్, సుదీర్కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.