వరంగల్, జూన్ 27 : కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని బల్దియా గీవెన్స్లో ప్రజలు కమిషనర్ ప్రావీ ణ్యకు విన్నవించారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నిర్వహించిన గ్రీవెన్స్లో ఆమె ప్రజల నుంచి వినతు లు స్వీకరించారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు వినతుల ద్వారా గ్రీవెన్స్ లో కాలనీల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువ చ్చారు. కాలనీల సమస్యలను పరిష్కరించాలని కమిషన ర్ను కోరారు. హనుకొండ టైలర్స్ స్ట్రీట్లోని ఇంటి నంబర్ 4-9-118లో నల్లా కనెక్షన్ లేకున్నా పన్ను వస్తోందని బాధితురాలు జయప్రద కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే నల్లా పన్ను తొలగించాలని కోరారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పిం చాలనికి నగర రహదారుల గోడలపై పెయింటింగ్ చేయిం చాలని ప్రేరణ విద్యా వికాస పోషణ ఫౌండేషన్ ప్రతి నిధులు గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ఖిలా వరంగల్ ఈద్గా ప్రాంత పరిస రాలను శుభ్రం చేయాలని ఈద్గా కమిటీ గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. టీఎస్ బీపాస్లో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుని 21 రోజులు గడిచినా ఇప్పటి వరకు అనుమతులు మంజూరు కాలేదని గిర్మాజీపేటకు చెందిన మహ్మద్ నసీరుద్దీన్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజారోగ్యం, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, పన్నుల విభాగాలకు సంబంధించిన సమ స్యలపై ప్రజలు గ్రీవెన్స్లో అధికారులకు వినతులు అంద జేశారు. గ్రీవెన్స్లో మొత్తంగా 65 వినతులు వచ్చాయి. టౌన్ప్లానింగ్ విభాగానికి 29, ఇంజినీరింగ్ విభాగానికి 19, ఎలక్ట్రీకల్ విభాగం 1,ప్రజారోగ్యం 4, పన్నుల విభా గానికి 12 వినతులు వచ్చాయి. ఈ గ్రీవెన్స్లో ఆదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, డీఎఫ్వో కిశోర్, డిప్యూటీ కమిషనర్ రవీందర్రెడ్డి, జోనా, సీహె చ్వో శ్రీనివాసరావు, హర్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, వింగ్ అధికారులు పాల్గొన్నారు.
మ్యూజికల్ గార్డెన్లో లేజర్ షో ఏర్పాటు చేయాలి
వరంగల్,జూన్ 27 : కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో సందర్శకులను ఆకట్టుకునేలా లేజర్ షో ఏర్పాటు చేయా లని కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. సోమవారం కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం హంటర్రోడ్లోని జూ పార్కు ఎదురుగా రూ.1,6 కోట్లతో నిర్మిస్తున్న మూడు అంతస్తుల సైన్స్ సెంటర్, ఎస్సీ, ఎస్టీ ట్రైనింగ్ సెంటర్లో నిర్మిస్తున్న వసతి గృహం, డార్మెంటరీ పనులను పరిశీలిం చారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట కుడా ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, ఈఈ భీమ్ రావు, డీఈ రఘునందన్, ఏఈ సిద్దార్థ నాయక్, హచ్వో వేణుగోపాల్ పాల్గొన్నారు.