ఖానాపురం, జూన్ 27 : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలుపుతూ పోలీసు కాల్పులకు బలైన దామెర రాకే శ్ సొంత గ్రామం దబీర్పేటను దత్తత తీసుకుంటున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. అగ్నిపథ్ను వెంటనే రద్దుచేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. మండలంలోని దబీర్పేటలో రాకేశ్ సంస్మరణ సభ సోమవారం నిర్వహించారు.
మంత్రి ఎర్రబెల్లి, కలెక్టర్ బీ గోపి, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్ రాకేశ్ చిత్రపటానికి పూల మా ల వేసి నివాళులర్పించారు. అనంతరం అతడి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు, రాకేశ్ సోదరుడు రాంరాజ్కు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది యువకులు అహర్నిశలు కష్టపడి ఆర్మీ ఈవెంట్స్ పూర్తిచేసి రాత పరీక్ష కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లిందని పేర్కొన్నారు. ఈ పథకానికి వ్యతిరేకంగా పోరాడినందుకే రాకేశ్ను కేంద్ర ప్రభుత్వం హత్య చేసిందన్నారు. రాకేశ్ మృతిని కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
ఇంత కన్నా దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మంత్రి కిషన్రెడ్డి రాకేశ్ హత్యపై స్పందించకపోవడం దారుణమన్నా రు. పైగా అగ్నిపథ్లో చేరితే నాలుగేళ్ల తర్వాత బట్టలు ఉతకడం, గడ్డం చేయడం, గిన్నెలు కడగడం నేర్చుకోవచ్చని కిషన్రెడ్డి అనడం అతడి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ముందూ వెనుక ఆలోచించకుండా పథకాలు తీసుకురావడం, వ్యతిరేకత వస్తే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి వాటిని రద్దు చేయడం కేంద్రానికి అలవాటేనని ఎద్దేవా చేశారు. 700 మంది రైతుల ఆత్మహత్యల తర్వా త వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు.
రాకేశ్ మృతిపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తున్నదన్నారు. అతడి కుటుంబంపై నిజమైన ప్రేమ ఉంటే ఆదుకోవాలి కాని రాజకీయాలు చేయొద్దని హిత వు పలికారు. త్వరలోనే రాకేశ్ కుటుంబాన్ని సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. దబీర్పేటకు రూ.50 లక్షలు, కీర్యాతండాకు రూ.20 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకంలో గ్రామానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
కుటుంబానికి అండగా నిలిచాం : పెద్ది
రాకేశ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచిందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాకేశ్ మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ను రద్దు చేసేవరకు పోరాటం చేస్తామన్నారు.
రాకేశ్ మృతి అతడి కుటుంబానికి తీరని లోటు : ఎమ్మెల్యే అరూరి రమేశ్
రాకేశ్ మృతి అతడి కుటుంబానికి తీరని లోటని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువకుడు కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల మృతిచెందడం బాధాకరమన్నారు. రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్ నీలమ్మ, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఎంపీటీసీ భట్టు శంకర్ పాల్గొన్నారు.