నల్లబెల్లి, జూన్ 25 : సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో రూ.7.26కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి కార్యక్రమంలో అభివృద్ధి చేసేందుకు మండలంలోని 16 పాఠశాలలను ఎంపిక చేయగా తొలి విడుత 9 స్కూళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
ప్రభుత్వ ఆశయానికనుగుణంగా ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. నందిగామ, ముచ్చింపుల, రేలకుంట, నల్లబెల్లి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, ఎంపీడీవో విజయ్కుమార్, మండల ప్రత్యేకాధికారి జహీరొద్దీన్, ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్లు గుగులోత్ రవళిక, నానెబోయిన రాజారాం, నాగులగాని సలేంద్ర, సిద్దూరి రత్నాకర్రావు, నోడల్ అధికారి రామస్వామి, మన ఊరు-మన బడి ఏఈ చందర్ తదితరులు పాల్గొన్నారు.