అచ్చు రైలు పెట్టెలను పోలినట్లున్న ఈ సర్కారు బడి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నేరేడుపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇలా రూపుదిద్దుకుంది. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా తరగతి గదులకు తీరొక్క రంగులు వేయడంతో పాటు తెలుగు, ఆంగ్ల వర్ణమాల, బొమ్మలు వేయించి తీర్చిదిద్దడంతో అమితంగా ఆకర్షిస్తోంది.
– ఫొటోగ్రాఫర్, జయశంకర్ భూపాలపల్లి