కరీమాబాద్, మే 21 : సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ది చెందుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 42వ డివిజన్లోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఉ ర్సు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కార్పొరేటర్ గుం డు చందన అధ్యక్షతన శనివారం మన బస్తీ -మన బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ మన బస్తీ- మనబడి కార్యక్రమంతో తెలంగాణలోని ప్రభుత్వ బడులకు మహర్దశ రానుందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగం లో మార్పులు తీసుకొస్తున్నారన్నారు. అందులో భా గంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో పాఠశాల ల్లో వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ బడు ల్లో వసతుల కల్పనతోపాటు ఉత్తమ విద్య అందుతుందని వివరించారు. విద్యార్థులు పోటీ పరీక్షలు, క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. నూరు శాతం ఫలితాలు వచ్చేలా కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు హాల్టికెట్లు అందజేశారు. ఉర్సులోని బడిలో రూ.22, 34, 295, రంగశాయిపేటలోని బడిలో 21,94,610 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీఈవో వాసంతి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కేడల జనార్దన్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, నాయకులు గుండు పూర్ణచందర్, మోడెం ప్రవీణ్, దామెరకొండ కరుణాకర్, బజ్జూరి రవి, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థులకు కంప్యూటర్ సదుపాయం..
పోచమ్మమైదాన్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి స్థానిక నాయకులు, దాతలు సహకారం అందించాలన్నారు. దేశాయిపేట పరిధిలోని పూర్వ విద్యార్థులు దాతలు, నాయకులు సహాయం అందజేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం నెల రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామనని, ఏర్పాట్లు చేయాలని డీఈవో వాసంతిని ఆదేశించారు.
అలాగే దేశాయిపేట పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ సదుపాయం అందుబాటులో తీసుకువస్తామని హామీనిచ్చారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాల్ టికెట్లను అందజేశారు. డీఈవో వాసంతి మాట్లాడుతూ.. జిల్లాలోని 72 పాఠశాలల్లో 31 పనులకు నిధులు మంజూరయ్యాయని, 29 స్కూళ్లకు అంచనాలు పంపినట్లు తెలిపారు. దేశాయిపేట పాఠశాలకు రూ.27లక్షలు మంజూరైనట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ కావటి కవిత, ఎంఈవో విజయ్కుమార్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు జన్ను దయాకర్, హెడ్మాస్టర్లు మహ్మద్ అఫ్జల్ షరీఫ్, అహల్య, నాయకులు రమేశ్బాబు పాల్గొన్నారు.