హనుమకొండ, మే 21 : నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి దీవకొండ దామోదర్రావును శనివారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. వాసుదేవరెడ్డి వెంట టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఉన్నారు.