గిర్మాజీపేట/నర్సంపేటరూరల్/నెక్కొండ, మే 21: ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డీఈవో కార్యాలయం ఎదుట తీవ్రవాదాన్ని సమాజంలో సమూలంగా నిర్మూలించాలని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజంలో శాంతి-సహృద్భావం, సోదరభావం విలసిల్లాలని ప్రతినబూనారు. దేశ భవిష్యత్ పునాదులైన యువతను సన్మార్గంలో నడిపించడమే కాకుండా, చట్ట వ్యతిరేక, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుండా వారిలో పరివర్తన తీసుకొచ్చే బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
కార్యక్రమంలో అకాడమిక్ అధికారి మాలోత్ సారయ్య, జీసీడీవో రమాదేవి, డీసీఈబీ సెక్రటరీ కృష్ణమూర్తి, సూపరింటెండెంట్లు చక్రవర్తి, బాబ్జీ, సీసీ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, జగదీశ్వర్, క్రాంతి, ఏపీవో రాజగోపాల్, ఏఎస్వో బాబురావు, శ్రీధర్, మనోజ్ పాల్గొన్నారు. నర్సంపేట తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ వాసం రామ్మూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తాసిల్దార్ కోరారు. కార్యక్రమంలో టీడీ ఉమారాణి, జూనియర్ అసిస్టెంట్ పెండ్లి రంజిత్కుమార్, వీఆర్వోలు రాజేందర్, కోమల, కంప్యూటర్ ఆపరేటర్ అనూష, వీఆర్ఏలు పాల్గొన్నారు. నెక్కొండలో రెవెన్యూ ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాదం, హింసను వ్యతిరేకిస్తామని, తోటి మానవులతో సామరస్యంతో మెలుగుతామని ఉద్యోగులు ప్రతినబూనారు. డీటీ రాజ్కుమార్, వీఆర్వోలు, వీఆర్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.