వరంగల్, మే 14: భద్రకాళి ఆలయంలో 12 రోజులపాటు వైభవంగా జరిగిన బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. చివరిరోజు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో భద్రకాళి చెరువులో అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం పుష్పయాగం చేశారు. హైదరాబాద్ వాస్తవ్యులు బేతి రఘువీర్-నీరజ దంపతులు బ్రహ్మోత్సవాల ముగింపు దాతలుగా వ్యవహరించారు. వారికి శేషవస్ర్తాలను బహూకరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శేషు భారతి మాట్లాడుతూ భద్రకాళి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగడానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భద్రకాళి అమ్మవారిని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్- వాణి దంపతులు దర్శించుకున్నారు. వారి వెంట మాలకుమ్మరి పరశురాములు, మోడెం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.