వరంగల్, మే 12 : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండలోని సుప్రభ హోటల్లో నీతి ఆయో గ్ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య వ్యవస్థ, పాలన బలోపేతం అంశంపై వివిధ శాఖల అధికారులతో గురువారం సంప్రదింపుల సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు గ్రామస్థాయిలో అందేలా ప్రణాళికలు రూపొందించిందన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రేటర్ పరిధిలోని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించామని గుర్తు చేశారు. కరోనా కా లంలో ముందుండి సేవలందించిన పారిశు ధ్య సిబ్బందికి వంద శాతం వ్యాక్సినేషన్ వే యించామని చెప్పారు. మానవ వ్యర్థాల శుద్ధీకరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఈ ఎఫ్ఎస్పీటీ ఉన్నప్పటికీ ప్రజల అవసరాల దృష్ట్యా మూడో ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం అనేక చర్యలు చేపడుతున్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విక్రయాలపై నిఘా పెట్టామని ఆమె వివరించారు.
ఇంటింటా చెత్త సేకరణ చేపట్టి తడి, పొడి చెత్తను వేరు చేసి శుద్ధి చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. ఇందుకోసం బయో మైనింగ్ పద్ధతిని వినియోగిస్తున్నామ ని వెల్లడించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వరంగల్లో 2, హనుమకొండలో 3 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో అరుదైన శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆధునిక పరికరాలు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంంగా రాష్ట్రంలో కేసీఆర్ కిట్లను అందజేస్తున్నామన్నారు. వరంగల్ కలెక్టర్ గోపి మా ట్లాడుతూ.. నగరంలోని ఎంజీఎం, ప్రసూతి దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్లో రూ.1200 కోట్ల వ్యయంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేసిందని, టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని పనులు పురోగతిలో ఉన్నాయని వివరించా రు. ఏడాదిలో దవాఖాన నిర్మాణం పూర్తయిన తర్వాత వైద్య సేవలు ప్రారంభవుతాయన్నా రు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి ప్రభుత్వం పోషకాహారం అందజేస్తున్నదని పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రైవేట్కు దీటు గా ప్రభుత్వ దవాఖానలు ఉన్నాయన్నారు. పేదలకు ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. కరోనా కాలంలో పోలీస్, వైద్య, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేశాయని అన్నారు. సమష్టిగా పనిచేయడం వల్లే కరోనా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వివరించారు. త్వరలోనే నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె అన్నారు. సీజనల్ వ్యాధులను గుర్తించేందుకు ఐసీసీసీ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సదస్సుల్లో నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ రాజేశ్వర్రావు, పీఎస్ఐ ఇండియా ఎండీ శంకర్నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.