గిర్మాజీపేట, ఏప్రిల్ 15 : మెరుగైన వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా ఇస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్యెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జిల్లాలోని లక్ష్మీపురానికి చెందిన నిరుపేద మహిళ బిర్రు వజ్రమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా నిమ్స్లో చేర్పించారు. అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యేని కలిసి పరిస్థితిని వివరించగా, తక్షణమే స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5లక్షలు మంజూరు చేయించి శనివారం బాధిత కుటుంబ సభ్యులకు శివనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఎల్వోసీ అందజేశారు. అలాగే, నియోజకవర్గానికి చెందిన 37మందికి రూ.15.94లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు వరంలా మారిందన్నారు. అలాగే, వరంగల్ చార్బౌళీలోని నోబుల్ ఫంక్షన్హాల్లో మహ్మద్ అలీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం మండీబజార్లోని ఓ కేఫ్లో స్థానికులతో ముచ్చటిస్తూ ఇరానీ చాయ్ తాగారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు బస్వరాజు శిరీషాశ్రీమాన్, ఎండీ పుర్ఖాన్, బాలిన సురేశ్, దిడ్డి కుమారస్వామి, ఆకుతోట తేజస్వీశిరీష్, పల్లం పద్మారవి, పస్కుల బాబు, మరుపల్లి రవి, సోమిశెట్టి ప్రవీణ్, టీఆర్ఎస్ అర్బన్ యూత్ నాయకుడు మోడెం ప్రవీణ్కుమార్, కొమ్ము రాజు, కొణతం మోహన్, పెంచాల కుమారస్వామి, గుమ్మడి దాసు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే నరేందర్..
ఖిలావరంగల్ : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వరంగల్ టీఎన్జీవోస్ నాయకులతో పాటు ఎమ్మెల్యే నన్నపునేని కలెక్టర్ బీ గోపిని కలిశారు. తూర్పు నియోజకవర్గంలో స బ్ ట్రెజరీ కార్యాలయం ఏర్పాటు చేస్తే సుమారు 6 వేల మంది పెన్షనర్లకు ఊరట లభిస్తుందని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం టీఎన్జీఓస్ నాయకులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, ప్రధాన కార్యదర్శి గాజె వేణుగోపాల్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోల రాజేశ్కుమార్, కోశాధికారి పాలకుర్తి సదానందం, ఉపాధ్యక్షులు మురళీధర్రెడ్డి, గద్దల రాజు, సిటీ అధ్యక్షుడు వెలిశాల రాజు, ఎంజీఎం యూనిట్ అధ్యక్షుడు రవికుమార్, కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
టీసీఎఫ్ ఆధ్వర్యంలో రన్ఫర్ జీసస్..
కాశీబుగ్గ : వరంగల్ ట్రైసిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. వెంకట్రామ జంక్షన్ నుంచి పోచమ్మమైదాన్ వరకు తీసిన ర్యాలీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని మాట్లాడారు. క్రైస్తవ సంఘాలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాస్టర్లు ఎమ్మెల్యే నరేందర్కు పూల మొక్క అందజేశారు. పాస్టర్లు రవికుమార్, ప్రేమ్కుమార్, శ్యాంసన్, గాబ్రియల్, సందేల లాజర్, జాన్సన్, చిన్న, యాకోబు, మార్క్, వినయ్, కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, వస్కుల బాబు, సురేశ్జోషి, బస్వరాజు శిరీషాశ్రీమాన్, ఎండీ పుర్ఖాన్, బాలిన సురేశ్, ఆకుతోట తేజశ్వీశిరీష్, మాజీ కార్పొరేటర్ యెలుగం సత్యనారాయణ పాల్గొన్నారు.