నయీంనగర్, ఏప్రిల్ 9 : రయ్ రయ్ మంటూ దూసుకుపోయే బైక్లు.. పెద్ద సైలెన్సర్లు, హారన్ల మోతల నడుమ రైడర్ల విన్యాసాలు.. వాటిని ఆసక్తిగా తిలకిస్తూ విద్యార్థులు వేసే ఈలలు, అరుపులతో నిట్ ప్రాంగణం మార్మోగింది. స్ప్రింగ్ స్ప్రీలో భాగంగా రెండో రోజు శనివారం నిర్వహించిన కేటీఎం బైక్ స్టంట్స్, అండర్ గ్రౌండ్ అథారిటీ బ్యాండ్, సన్బార్ డీజే ఆస్ట్రీస్, ఎస్కేప్ రూం బృందాల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందుకోసం నిట్ మైదానంలో ప్రత్యేక స్టేజీ ఏర్పాటుచేయగా బృందం పాడిన పాటలు విద్యార్థులను హుషారెత్తించాయి. దీనికి తోడు పలు వెరైటీ డీజే సౌండ్లకు విద్యార్థులు తమను తాము మరచిపోయి ఉర్రూతలూగారు.
మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిట్కు కొత్తందం వచ్చినట్లయింది. రెండు రోజుల పాటు పలు ఈవెంట్లు, కల్చరల్ ఫెస్ట్లతో ఉత్సాహం నింపిన వసంతోత్సవాలు ఆదివారం ముగియనున్నాయి. ఇందులో పాల్గొని, ప్రతిభ చూపిన వారికి నేడు బహుమతులు ప్రదానం చేయనున్నారు. రాత్రి 8గంటల నుంచి విద్యార్థుల ఫ్యాషన్ షో ఉంటుంది.ప్రముఖ బాలివుడ్ సింగర్ దర్శన్రావల్ తన గ్రాతంతో శ్రోతలను కట్టిపడేశారు.
చాలా థ్రిల్లింగ్గా అనిపించింది..
నేను స్టంట్స్ను నేరుగా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. టీవీలు, ఫోన్లలో చూడడమే తప్ప.. ఎప్పుడూ లైవ్గా చూడలేదు. అలాంటిది నేను స్టంట్స్ను దగ్గరగా చూడ డం చాలా హ్యాప్పీగా, థ్రిల్లింగ్గా అనిపించింది.
– నిఖిత