కరీమాబాద్, ఏప్రిల్ 6: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు ఉపాధ్యాయులు ఆంగ్లంలో పట్టు సాధించాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి సారయ్య సూచించారు. వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు కార్యక్రమాన్ని (ఈఎల్ఈసీ) బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రభుత్వం అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నందున ఉపాధ్యాయులు అందుకు తగినట్లు సన్నద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వ ఆశయానికనుగుణంగా సిబ్బంది పని చేయాలన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సదానందం, కోర్సు డైరెక్టర్, హెచ్ఎం శారదాబాయి, మెంటర్స్ జెసెఫ్, పోగు అశోక్, భిక్షపతి పాల్గొన్నారు.
విద్యా అభివృద్ధికి టీచర్లు కృషి చేయాలి
దుగ్గొండి: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధన ప్రారంభించనున్నందున ఉపాధ్యాయులు విద్యా అభివృద్ధికి కృషి చేయాలని ఎంఈవో చదువుల సత్యనారాయణ సూచించారు. మండలకేంద్రంలోని జడ్పీఎస్ఎస్లో ఆంగ్ల బోధన, కమ్యునికేషన్ స్కిల్స్పై ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి మానిటరింగ్ అధికారిగా వ్యవహరించిన ఎంఈవో సెంటర్ను సందర్శించి మాట్లాడారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధన అందించేందుకు ప్రభు త్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనుందన్నారు. ఈ మేరకు స్కెర్ట్, అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈఎల్ఈసీ శిక్షణను 8 వారాలపాటు ఆన్లైన్, వారం రోజులపాటు ఆఫ్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈఎల్ఈసీ ప్రాధాన్యాన్ని ఎంఈవో టీచర్లకు వివరించారు. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్పై పట్టు సాధించేలా బోధించాలన్నారు. రిసోర్స్పర్సన్ నాగార్జునరావు, కోర్సు డైరెక్టర్ ప్రవీణ్కుమార్, మెంటర్స్ శ్రీనివాస్, సతీశ్కుమార్, నాగరాజు, 45 మంది టీచర్లు పాల్గొన్నారు.