నర్సంపేట, ఏప్రిల్ 5: దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కొనియాడారు. జగ్జీవన్రాం 115వ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రాం చిత్రపటానికి పెద్ది పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి ఉపప్రధానిగా జగ్జీవన్రాం ఎన్నో సేవలు అందించారన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి జీవితంలో ఏదైనా సాధించొచ్చని ఆయన నిరూపించారని తెలిపారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, ఎస్సీసెల్ డివిజన్ అధ్యక్షుడు కల్లెపెల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
నర్సంపేట/నర్సంపేటరూరల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. పట్టణంలోని అక్షర స్కూల్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. చదువే కాకుండా పిల్లలను కళలు, ఆటల్లో ప్రోత్సహించాలని పెద్ది యాజమాన్యానికి సూచించారు. విద్యార్థుల్లో మేథోశక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ అండృ రాజేంద్రప్రసాద్రెడ్డి, ట్రెజరరీ వనజ, జనరల్ సెక్రటరీ రాజేశ్వర్రెడ్డి, పావని, ప్రిన్సిపాల్ జ్యోతి, బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఇటుకాలపల్లికి చెందిన యామంకి రవి-సుమలత దంపతుల చిన్న కుమారుడు యామంకి శ్రీనాథ్(14) ఈతకు వెళ్లి బావిలో మునిగి మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ మండల రవీందర్, ఎంపీటీసీ భూక్యా వీరన్న, ఉప సర్పంచ్ జమాండ్ల చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ కట్ల సుధాకర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు బొడిగె వినయ్, మండల రాజమౌళి ఉన్నారు. అలాగే, ఎమ్మెల్యే పెద్ది పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఉపాధ్యక్షుడు అల్లి రవి, బండారి రమేశ్, వల్లాల కరుణాకర్గౌడ్, దాసరి బుచ్చిరెడ్డి, టీ రమేశ్, ఏ లింగయ్య పాల్గొన్నారు.