మాజీ ఉప ప్రధాని, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం 115వ జయంతిని జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలు, పలు సంస్థల ప్రతినిధులు, అధికారులు, నాయకులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో జగ్జీవన్రాం సేవలను వక్తలు కొనియాడారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్/చెన్నారావుపేట/ఖానాపురం, ఏప్రిల్ 5: నర్సంపేటలో బాబూ జగ్జీవన్రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కల్లెపెల్లి ప్రణయదీప్మాదిగ పూలమాల వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బాబూ జగ్జీవన్రాం అని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్, ఎల్హెచ్పీఎస్ జాతీయ కార్యదర్శి వాసునాయక్, అడ్వకేట్ మోటూరి రవి, మైనార్టీ హక్కుల పోరాట సమితి నాయకులు ఎస్కే జావిద్, జన్ను సాంబయ్య, బుచ్చిరాములు, ముఖేశ్, లక్ష్మణ్, వంశీ, శ్రీహరి, స్టాలిన్, శివ, తేజ, రాజు, లక్ష్మి, ప్రణీత, ప్రవళిక, రమ్య, కావ్యశ్రీ పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని రామవరం జీపీ కార్యాలయంలో జగ్జీవన్రాం చిత్రపటానికి సర్పంచ్ కొడారి రవన్న పూలమాల వేసి నివాళులర్పించారు.
ఉప సర్పంచ్ జినుకల విమల, వార్డు సభ్యులు కిషన్, కుమారస్వామి, సుమలత, సురేశ్, గ్రామపెద్దలు రాజు, జినుకల శంకర్, మొగిలి, భగవాన్దాస్, మల్లేశం, సురేందర్బాబు పాల్గొన్నారు. నర్సంపేట తహసీల్ కార్యాలయంలో జగ్జీవన్రాం చిత్రపటం వద్ద ఆర్ఐ ఎండీ రజాక్, వీఆర్వోలు, వీఆర్ఏలు నివాళులర్పించారు. చెన్నారావుపేట మండలం లింగగిరిలో సర్పంచ్ మాదారపు భాస్కర్ ఆధ్వర్యంలో జగ్జీవన్రాం జయంతి నిర్వహించారు. ఆయన జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అలాగే, మండలకేంద్రంలో టీఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆకులపెల్లి ఉప్పలయ్య జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో అంబేద్కర్ యువజన శాఖ జిల్లా ఉపాధ్యక్షుడు మాదారపు మాణిక్యం, జిల్లా ప్రచార కార్యదర్శి బర్ల ప్రవీణ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదారపు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి పసునూరి యాకయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు పరకాల కొంరయ్య, తీగల అశోక్, బాబు, జంగిలి భాస్కర్, చెన్నయ్య, అరవింద్, చిరంజీవి, కల్యాణ్, రఘు, పవన్, బన్నీ, కారోబార్ దాసరి రమేశ్, నాంపెల్లి శ్రీశైలం పాల్గొన్నారు. ఖానాపురంలోని ఎస్సీకాలనీలో జగ్జీవన్రాం చిత్రపటానికి ఎంపీటీసీ మర్రి కవిత-బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మర్రి రామస్వామి, మర్రి రాజాలు, మర్రి రమేశ్, పీసరి వెంకన్న, మర్రి వెంకన్న, సురేశ్, వీరస్వామి, హృదయ తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి..
దుగ్గొండి/సంగెం/రాయపర్తి: అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం అని ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ అన్నారు. దుగ్గొండిలోని బస్టాండ్ ఆవరణలో ఏబీఎస్ఎప్ ఆధ్వర్యంలో జగ్జీవన్రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కొలగాని రవి, జన్ను రవి, వంశీ, సందీప్, కృష్ణ, రాకేశ్, వినయ్కుమార్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంగెం మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జగ్జీవన్రాం జయంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంగెంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీపీ కళావతి హాజరై మాట్లాడుతూ దేశానికి విశేష సేవలు అందించిన మహానేత బాబూ జగ్జీవన్రాం అని కొనియాడారు.
కార్యక్రమంలో సునీల్, సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, లవ్కుమార్, ఏలియా, శేఖర్, నరహరి, మోహన్, బొజ్జ సురేశ్, సదయ్య, నాగార్జునశర్మ, పులి వీరస్వామి, కొమురయ్య, రాజశేఖర్, నల్లతీగల రవి, ప్రశాంత్ పాల్గొన్నారు. రాయపర్తి రాజీవ్చౌరస్తాలోని బాబూ జగ్జీవన్రాం విగ్రహాన్ని ప్రజాసంఘాల నేతృత్వంలో పూలమాలలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు జగ్జీవన్రాం విగ్రహం వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల శ్రేణులు, ఎమ్మార్పీఎస్ నాయకులు వేర్వేరుగా హాజరై నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ప్రజాసంఘాల ప్రతినిధులు అయిత మల్లేశ్, యాకయ్య, గబ్బెట బాబు, ఉస్మాన్, మచ్చ సత్యం, చందు రామ్యాదవ్, సుధాకర్, నల్ల యాకయ్య, గారె శ్రీనివాస్, లక్ష్మణ్, అయిత సంపత్కుమార్, శ్రీనివాస్,మాచర్ల ప్రభాకర్, మహ్మద్ మైమూద్పాషా, వశపాక కుమార్ పాల్గొన్నారు.
జగ్జీవన్రాం ఆశయ సాధన కృషి చేయాలి
నల్లబెల్లి/నెక్కొండ/పర్వతగిరి: నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్గౌడ్ బాబూ జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ నానెబోయిన రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరావు, టీఆర్ఎస్ నాయకులు ఎల్లస్వామి, రాంబాబు, నరహరి, నన్నెసాహెబ్, దళిత సంఘాల నాయకులు బొట్ల నరేశ్, బొట్ల ప్రతాప్, బట్టు సాంబయ్య, పరికి కోర్నేల్, అనిల్, హెచ్ఆర్సీ సభ్యుడు సునీల్ పాల్గొన్నారు. నెక్కొండ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సొంటిరెడ్డి యమున రంజిత్రెడ్డి జగ్జీవన్రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉప సర్పంచ్ డీ వీరభద్రయ్య, కార్యదర్శి సాంబయ్య, వార్డు సభ్యులు తోట సాంబయ్య, ఈ దిలీప్, పీ భానుప్రకాశ్, ఈ మాలతి, రామారపు శిరీష పాల్గొన్నారు.
అలాగే, అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు, ఈదునూరి వెంకటేశ్వర్లు, ఈదునూరి యాకూబ్, మాంకాల యాదగిరి, వడ్డూరి కుమారస్వామి పాల్గొన్నారు. రాజీవ్నగర్లో ఎమార్మీఎస్ టీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వడ్డూరి కుమార్, జంజాల యాకయ్య, తాటికాయల యాకయ్య, కనకరాజు, అరుణ్, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఎర్రబెల్లి మదన్మోహన్రావు, రమేశ్, అశోక్, జాటోత్ అనిల్నాయక్, నందానాయక్, కందుకూరి వెంకటేశ్వర్లు, దాసరి శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరిలో జరిగిన జగ్జీవన్రాం జయంతిలో ఎస్సై కే కిశోర్కుమార్, మార్కెట్ డైరెక్టర్ పట్టపురం ఏకాంతంగౌడ్, పర్వతగిరి సర్పంచ్ మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, బొట్ల మహేంద్ర, ఉపసర్పంచ్ రంగు జనార్దన్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్గౌడ్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. వడ్లకొండలో అంబేద్కర్ సంఘం నాయకుడు, మాజీ ఎంపీపీ వల్లందాసు రంగయ్య, సర్పంచ్ అమడగాని రాజుయాదవ్, ఉపసర్పంచ్ పంతంగి ఉప్పలయ్య, మనోహర్, నరసయ్య, కుమారస్వామి, మధుకర్, రామ్చందర్, భాస్కర్, ఎల్లాస్వామి, పాపయ్య, రాజ్కుమార్ పాల్గొని జగ్జీవన్రాం చిత్రపటాలకు నివాళులర్పించారు.
జగ్జీవన్రాం సేవలు మరువలేనివి..
కరీమాబాద్/కాశీబుగ్గ/గీసుగొండ, ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రాం సేవలు మరువలేనివని మామునూరు 4వ బెటాలియన్ కమాండెంట్ శివప్రాద్రెడ్డి అన్నారు. బెటాలియన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వరంగల్ 40వ డివిజన్లోని ఉర్సులో టీఆర్ఎస్ నాయకుడు పసునూరి రమేశ్ ఆధ్వర్యంలో జగ్జీవన్రాం జయంతి నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాశీబుగ్గ 14వ డివిజన్ ఎనుమాముల జంక్షన్లో జగ్జీవన్రాం విగ్రహానికి 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్జోషి, మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రామకృష్ణ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం సహ అధ్యక్షుడు కోలా రాజేశ్కుమార్, జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, పాలకుర్తి సదానందం, గద్దల రాజు, వేముల వెంకటేశ్వర్లు, మురళీదర్రెడ్డి, చంద్రరావు, వంగ రవీందర్, సందీప్, రవికుమార్, నాగేశ్వరరావు, రమేశ్, సలీం, ప్రసాద్, మల్లేశం, సదానందం, లింగమూర్తి పాల్గొన్నారు. వెంకట్రామ జంక్షన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ పండ్లు పంపిణీ చేశారు. నర్మెట్ట చిన్న, భాషపాక సదానందం, కూచన రవీందర్, జన్ను భాస్కర్, సందెల లాజర్, జంగం ప్రభాకర్, రంజిత్, కోకిల యాకుబ్, గొర్రె రవి, కట్కూరి అన్వేశ్ పాల్గొన్నారు. వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి బస్స్టాండ్ సమీపంలోని జగ్జీవన్రాం విగ్రహానికి కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్ టీఆర్ఎస్ నేతలతో కలిసి నివాళులర్పించారు. గీసుగొండ మండలం మరియపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అల్లం బాలిరెడ్డి, ధర్మారంలో దూరవిద్య కేంద్రం కో ఆర్డినేటర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జగ్జీవన్రాం చిత్రపటాలకు పూలమాలలు వేశారు. బీసీసెల్ నాయకుడు మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.