కురవి, ఫిబ్రవరి 17: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రి గుగులోత్ లింగ్యానాయక్(85) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మేడారం జాతర సమీక్షిస్తున్న మంత్రి తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్దతండా గ్రామానికి చేరుకున్నారు. తండ్రి మృతదేహంపై పడి రోదించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిని ఫోన్లో పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ నామా నాగేశ్వర్రావు, ఎమ్మెల్సీ, ఆర్బీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిష్టినా, ఎమ్మెల్యే సీతక్క, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, శాసన మండలి మాజీ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, నర్సిరెడ్డి, సమ్మక్క- సారలమ్మ దేవాలయ కమిటీ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అధికారులు సర్వేశ్వర్రెడ్డి ఫోన్లో మంత్రి సత్యవతిరాథోడ్ను పరామర్శించారు.
ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్, ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, వరంగల్ ఎంపీ దయాకర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, జడ్పీ చైర్ప ర్సన్ అంగోత్ బిందు, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, ఆర్డీవో కొమురయ్య, ములుగు జడ్పీచైర్మన్ జగదీశ్వర్, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్రావు, నూకల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు లింగ్యానాయక్ మృతదేహం వద్ద పూలమాలు వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే శంకర్నాయక్ పాల్గొని పాడె మోశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి, బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్రెడ్డి, జిల్లా నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ రమేశ్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ గుగులోత్ రవి, పెద్దతండా సర్పంచ్ గుగులోత్ వనజాశ్రీరాం, ఐలి నరహరి, బాదె నాగయ్య, బోడ శ్రీను, నూకల శ్రీరంగారెడ్డి, సర్పంచ్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.