కాశీబుగ్గ, ఫిబ్రవరి 16: ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేస్తే ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్సీ పోచ్చంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వరంగల్ 19వ డివిజన్ ఓసిటీలోని శ్రీఆంజనేయస్వామి ఆలయం దగ్గర బుధవారం రక్తదాన శిబిరాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే, మహా మృత్యుంజయ సహిత హోమాన్ని నరేందర్-వాణి దంపతులు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ పోచ్చంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణను సీఎం కేసీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. నిరుపేదలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. సీఎం కేసీఆర్తోనే యువతకు రాజకీయ భవిష్యత్ లభించిందన్నా రు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే, 92 మందికి రూ. 92,10,672 విలువైన కల్యాణలక్ష్మి, 39 మందికి 14,08,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున రూ. 6 లక్షల విలువైన బీమా చెక్కులు మంజూరు కాగా, వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా సుల్తానా, కార్పొరేటర్లు వస్కుల బాబు, బాల్నె సురేశ్, దిడ్డి కుమారస్వామి, కావటి కవితా రాజుయాదవ్, సురేశ్జోషి, ఫుర్కాన్, బోగి సువర్ణ, ముష్కెమల్ల అరుణ, సోమిశెట్టి ప్రవీణ్, బస్వరాజు శిరీషా శ్రీమాన్, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, కుందారపు రాజేందర్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బాలాజీ, డాక్టర్ సనత్, డాక్టర్ తాళ్ల రవి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గజ్జెల రాంకిషన్, వేణుగోపాల్ పాల్గొన్నారు. రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.