న్యూశాయంపేట, నవంబర్ 30: అభివృద్ధి, సంక్షేమాన్ని నచ్చి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్త లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం హంటర్ రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో పోలెపాక ఉపేంద్రం ఆధ్వర్యం లో 1, 2 డివిజన్ల పరిధిలోని పెగడపల్లి ప్రాంతానికి చెందిన కార్యకర్తలు పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు కేవలం ప్రజలనే కాకుండా ప్రతిపక్ష పార్టీల ను విశేషంగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. కొత్త, పాత తేడా లేకుండా అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అరూరి రమేశ్ ప్రజల మధ్య నిరంతరం ఉండి అభివృద్ధి పనులు చేపడుతున్నందుకే టీఆర్ ఎస్లో చేరామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన, పీoసీఎస్ చైర్మన్ చల్లా గోపాల్రెడ్డి, వైస్ చైర్మన్ కుమార్యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నేరెడ్ల శ్రీధర్, టీఆర్ఉస్ సీనియర్ నాయకులు చల్లా వెంకటేశ్వర్రెడ్డ్డి నన్నెబో యిన రమేశ్యాదవ్, గనిపాక విజయ్, ఇనుముల నాగరాజు, నరేశ్, లెనిన్, కొంరెల్లి, గుండెటి శ్యాంకుమార్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.