హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 27: రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. గెలుపే లక్ష్యంగా కోర్టులోకి దిగిన క్రీడాకారులు చివరి వరకు పోటీ పడ్డారు. పాయింట్స్ సాధించేందుకు నువ్వా-నేనా.. అన్నట్లుగా బ్యాట్లకు పనిచెప్పారు. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘యునెక్స్ సన్రైజ్ 8వ రాష్ట్రస్థాయి అండర్-15 బాలబాలికలు, వెటరన్స్(65+ 70+, 75+) బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు గురువారం హనుమకొండ జిల్లా సుబేదారిలోని వరంగల్ క్లబ్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ముఖ్య అతిథిగా వరంగల్ సీపీ తరుణ్జోషి పాల్గొని పోటీలను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. బ్యాడ్మింటన్ క్రీడకు తెలుగు క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు భవిష్యత్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ర్టానికి, దేశానికి గుర్తింపు తేవాలన్నారు. ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్లో భువనేశ్వర్లో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని, రాష్ర్టానికి పతకాలు తెస్తారని ఆకాంక్షించారు.
అనంతరం వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రమేశ్కుమార్, కార్యదర్శి పింగిళి రమేశ్రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 165 మంది క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీ పడుతున్నారని తెలిపారు. అలాగే వెటరన్స్ విభాగంలో 65+లో 9 జట్లు, 70+లో 8 జట్లు, 75+లో 10 జట్ల క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ డీ నాగకిషన్, ఉపాధ్యక్షుడు ఎం జితేందర్రెడ్డి, నిమ్మ మోహన్రావు, సంయుక్త కార్యదర్శి కొమ్ము రాజేందర్, రాజ్కుమార్, అగర్వాల్, రవిచంద్ర, చీఫ్ రెఫరీ కే పాణిరావు, పీవీఎల్ కుమార్, హన్మంతరావు, కిశోర్, ఎం శ్రీనివాసరెడ్డి, శ్యాంకుమార్, శ్రీధర్, అంపైర్లు భాస్కర్, కృష్ణవేణి, మల్లికార్జున్, రవి, శైలజ, అరుణ్, ప్రణయ్, వెంకటస్వామి, మహేశ్, రాహుల్, ఆఫ్రిద్ పాల్గొన్నారు.
బాలుర విభాగంలో..
రామ్ గాజుల(ఆదిలాబాద్)-కే ప్రవేశ్(నిజామాబాద్)పై గెలుపొందాడు. ధృవ్ పరిషద్సేథి(హనుమకొండ)-వైఎస్చౌదరి(రంగారెడ్డి)పై, అలీ సిద్ధికి(వరంగల్)-జష్ణుతేజ్ గుర్రం(రంగారెడ్డి)పై, క్రిశ్భార్గవ్(హైదరాబాద్)-ఆర్ చౌదరి(నల్లగొండ)పై, అమిర్ఆసిమ్(హైదరాబాద్)-వినీల్కుమార్(ఖమ్మం)పై, కే మనవ్(నిజామాబాద్)-అన్విత్ నిహాల్రెడ్డి(రంగారెడ్డి)పై, వీ ప్రభాస్(హైదరాబాద్)-ఎం అవినాశ్(జనగాం)పై గెలుపొందారు.
బాలికల విభాగంలో..
కైవాల ధర్మపూరి(కరీంనగర్)-పూజిత(వరంగల్)పై గెలుపొందారు. అవని గోవింద్ విక్రమ్(రంగారెడ్డి)-ఏ మేదశ్రీ(సూర్యపేట)పై, వైశల్య కుంతల(కరీంనగర్)-వీ శ్రీలాస్య(నల్లగొండ)పై, అమరితరావు చేప్యాల(రంగారెడ్డి)-కే నక్షత్ర(కామారెడ్డి)పై, అనుసంజన మురళి(హైదరాబాద్)-ముప్పిడి జయలక్ష్మి(రంగారెడ్డి)పై, పీ వైష్ణవి(నల్లగొండ)-ఎం శ్రీలాస్య(సూర్యాపేట)పై, రిషిత పాండే(వరంగల్)-సీహెచ్ నందిత(ఖమ్మం)పై, దేవినేని రిథిమా(హైదరాబాద్)-కే రసజ్ఞ(జనగామ)పై, వీ వీక్షిత(వరంగల్)-నెల్లూరి తులసి శ్రీజ(భద్రాద్రి)పై, సమీక్షరెడ్డి(హైదరాబాద్)-ధృతీ సహస్త్ర బండా(మహబూబ్నగర్)పై, ప్రంజాల నిసర్గా(రంగారెడ్డి)-భువంద్కృతి(కామారెడ్డి)పై గెలుపొందారు.