దుగ్గొండి, సెప్టెంబర్ 28: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఆడబిడ్డ సంతోషంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేసి వారి ఆత్మబంధువుగా నిలిచారని జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని చలపర్తి, రేఖంపల్లి, శివాజీనగర్, బిక్కాజిపల్లి, పొనకల్, లక్ష్మీపురం, బంధంపల్లి, కేశవాపురం గ్రామాల్లో శనివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మహిళలకు చీరలు అందించారు. అనంతరం సర్పంచ్ల అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో మరుగున పడిన పండుగలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్యయ్య, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, సర్పంచ్లు ముదురుకోళ శారదాకృష్ణ, ఇమ్మడి యుగేంధర్, లింగంపల్లి ఉమారవీందర్రావు, సింగనబోయిన భాగ్యలక్ష్మి-లింగయ్య, బొమ్మగాని ఉర్మిళ-వెంకన్న, పాండవుల సురేందర్, సునీత, రేవూరి నారాయణరెడ్డి ఎంపీటీసీలు రంపీస సోనీ రతన్, బండి జగన్, మామునూరి సుమన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండ..
సంగెం/ఖానాపురం/కరీమాబాద్/నర్సంపేటరూరల్/పోచమ్మమైదాన్: ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని సంగెం జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని గవిచర్లలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సర్పంచ్ దొనికెల రమా శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖానాపురం మండలం కొత్తూరు, రంగాపురంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు పంపిణీ చేశారు. సర్పంచ్లు బూస రమా అశోక్, కందిక నరేశ్, బీ శ్రీను, సర్పంచ్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ 41వ డివిజన్ పరిధిలోని మహిళలకు కార్పొరేటర్ పోశాల పద్మ చీరలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకులు పోశాల స్వామి, బజ్జూరి రవి, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. నర్సంపేట మండలం లక్నేపల్లి జీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ మహిళలకు బతుకమ్మ చీరలు అందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, సర్పంచ్ గొడిశాల రాంబాబుగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత తదితరులు పాల్గొన్నారు. వరంగల్ 12వ డివిజన్లోని దేశాయిపేట రంగనాయకస్వామి ఆలయంలో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సీఈవో మాధవి, టీఎల్ఎఫ్ రజిత, ఆర్పీలు పాల్గొన్నారు.