Rahul Gandhi : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) లపై లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandghi) మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో బీజేపీ రాజకీయ ఆధిపత్యం క్షీణించిందని, మోదీ, అమిత్ షా రాజకీయ ప్రయాణం ముగిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో బీజేపీకి స్వతంత్రంగా మెజారిటీ లేకపోవడంవల్ల ఆ పార్టీ రాజకీయ శక్తి, పట్టు పూర్తిగా తగ్గిపోయాయని రాహుల్గాంధీ అన్నారు. గతంలో చూపిన రాజకీయ ఆధిపత్యాన్ని మోదీ, అమిత్ షా జోడీ ఇప్పుడు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, ‘ఇండియా’ కూటమి మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలపై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.