\ఖానాపురం, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్ను పది శాతానికి పెంచగా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని దబీర్పేట, కీర్యతండా, అశోక్నగర్, అయోధ్యనగర్, చిలుకమ్మతండా, చిలుకమ్మనగర్, బుధరావుపేటలో కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరైన వారికి శుక్రవారం ఆయన గుర్తుంపు కార్డులు, అదేవిధంగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పెద్ది పాల్గొని మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారులు ఒక చేత్తో ఆసరా పింఛన్ కార్డులు, మరో చేత్తో బతుకమ్మ చీరలను తమ ఇళ్లకు తీసుకెళ్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్ను సాధించుకుని వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నామని వివరించారు. కేంద్రం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. దళిత, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 150 యూనిట్లు, నాయీబ్రాహ్మణులు, రజకులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఎత్తివేయాలని చూస్తున్నదని విమర్శించారు.
అదేవిధంగా ఉపాధిహామీ పథకాన్ని సైతం ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తామని బండి సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ మానవీయ కోణంలో ఉంటాయన్నారు. దసరా తర్వాత గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలని ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో దసరా తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఉపేందర్రెడ్డి, సర్పంచ్ గొర్రె కవిత, అశోక్, వెంకన్న, కార్యదర్శులు అబేద, యుగేంధర్, సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: మండలంలోని అన్ని గ్రామాలకు పక్కా రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ముచ్చింపుల, కన్నారావుపేట, శనిగరం, గోవిందాపూర్, మేడెపెల్లి, రాంపూర్, కొండాపూర్ గ్రామాల్లో 680 మంది లబ్ధిదారులకు పెద్ది బతుకమ్మ చీరలతోపాటు ఆసరా పింఛన్కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జైకిసాన్ ఉద్యమం ద్వారా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాడి రైతాంగ సమస్యలను పరిష్కరించుకుందామని పెద్ది పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఎక్కడా అమలు కాని అభివృద్ధి, సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల ఆసరా పింఛన్లు మంజూరు చేసి వృద్ధులు, దివ్యాంగులు, గౌడ కులస్తులు, ఒంటరి మహిళలు, వితంతువులకు సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు అయ్యారని తెలిపారు. బుచ్చిరెడ్డిపల్లెలో 52 ఎకరాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీతోపాటు కన్నారావుపేటలో మిర్చి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, అన్ని జీపీల్లో నూతన భవనాలకు నిధులు మంజూరు చేయించనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్, తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్కుమార్, వైస్ ఎంపీపీ గందె శ్రీలతా శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, నాయకులు కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, పాలెపు రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
సర్కారు బడుల బలోపేతమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. మండలకేంద్రంలోని కేజీబీవీలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నానెబోయిన రాజారాం, కేజీబీవీ ప్రత్యేకాధికారి సునీత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే, కొండాపూర్లో ఎంపీవో కూచన ప్రకాశ్, కార్యదర్శి రజిత వినూత్నంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఓడీఎఫ్ప్లస్ అంశాలపై గ్రామంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికులకు అవగాహన కల్పించడం అభినందనీయమని పెద్ది అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గూబ తిరుపతమ్మ, కార్యదర్శి రజిత, ఎస్సై రాజారాం పాల్గొన్నారు.