జనగామ, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు (రూ.80 లక్షలతో కవర్షెడ్డు, రూ.50 లక్షలతో మార్కెట్ కార్యాలయ భవనం, రూ.20 లక్షలతో తాగునీటి ట్యాంకు నిర్మాణం) శంకుస్థాపన చేశారు. మార్కెట్ చైర్ పర్సన్ బాల్దె విజయ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడారు. ఉమ్మ డి రాష్ట్రంలో వ్యవసాయం చేయాలంటే రైతన్న అరిగోసపడేదన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రైతు బిడ్డే సీఎంగా రావడంతో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చాడన్నారు. పంట పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నాడన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? లేకుంటే ఇవన్నీ అమలు చేయించే దమ్ము, ధై ర్యం ఉందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సవాల్ విసిరారు.
కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకొని పరిపాలిస్తుంటే సీఎం కేసీఆర్ శ్రమను నమ్ముకొని ప్రజాపాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రజలకు పనికివచ్చే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సంస్కరణలు అమలు చేసే సంస్కృతి మాదైతే.. ధరలు పెంచి ప్రజల ఆస్తులు అమ్మే సంస్కృతి కేంద్రంలోని బీజేపీదని ఎద్దేవా చేశారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ఏడేళ్లలో తెలంగాణను అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని గాడిలో పెట్టే పనిలో పడ్డారని.. ‘దేశ్కీ నేత కేసీఆర్.. తెలంగాణ నేతగా కేటీఆర్’ అనే నినాదాన్ని ముందు కు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక, వినూత్న సంస్కరణలు, మార్పులు, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రం పచ్చగా మారిందన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ సంపత్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతుంటే ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయ ఉనికి కోసం కేసీఆర్ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరువు గడ్డగా ముద్రపడి పరిస్థితి నుంచి నేడు గోదావరి జలాలతో పునీతమై జలాశయాలన్నీ నిండుకుండలా కళకళలాడుతున్న జనగామ పచ్చటి పొలాలతో కోనసీమ అయిందన్నారు.
కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆగారెడ్డి, డైరెక్టర్లు చిన్నం నర్సింహులు, మాశెట్టి వెంకన్న, జనగామ జడ్పీటీసీ నిమ్మతి దీపిక, ఎంపీపీ మేకల కళింగరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు నిమ్మతి మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉడుగుల నర్సింహులు, మండల అధ్యక్షుడు యాదగిరిగౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు ప్రమోద్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు చెంచారపు పల్లవి, కౌన్సిలర్లు పాక రమ, స్వరూప, అనిత, గుర్రం భూలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్శర్మ, మార్కెట్ కార్యదర్శి జీవన్కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పెద్ది వెంకట నారాయణగౌడ్, టీఆర్ఎస్ నాయకుడు బాల్దె సిద్ధిలింగం తదితరులు పాల్గొన్నారు.