వరంగల్ చౌరస్తా, మే 25 : గిర్మాజీపేట గోవిందరాజుల గుట్ట క్షేత్రపాలకుడైన అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించారు. సుప్రభాత సేవ, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ, ఆకుపూజ, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ, ఉత్సవ విగ్రహాల దాతలు మోతుకూరి మహేశ్కుమార్ – లావణ్య, మరిపెల్లి సంజీవరావు – లీలావతి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు వరయోగుల శ్రీనివాసస్వామి మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణం నిర్వహించారు.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్కుమార్, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సునీల్కుమార్, జారతి శ్రీనివాస్, ఇప్ప ఆదినారాయణ, పర్ష శ్రీనివాస్, పల్లె యాదగిరి, సంగినేని దేవేందర్, రెడ్డిపల్లి పరమేశ్వర్, వన్నాల పాపయ్య, భక్తులు పాల్గొన్నారు.
గిర్మాజీపేట : మండిబజార్ నిజాంపుర కాలనీలోని దక్షిణ ముఖ సంజీవ ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన శివలింగ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని పాల్గొన్నారు. ఆలయ ప్రధనార్చకులు అమ్మోజు దైవాచార్యులు, ప్రతిష్టాచార్య తంగళ్లపల్లి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గణపతిహోమం, రుద్రహో మం, సర్వతోభద్ర మండలం హోమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం జరిగే శివలింగ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బండి రాజన్బాబు, ఆలయ కమిటీ అధ్యక్షుడు జెట్టి రాజ్కుమార్, కర్నె నరేశ్, జెట్టి రంజిత్, పప్పల రామకృష్ణ, కుక్కల వంశీ, జంగిలి రవీందర్ పాల్గొన్నారు. అలాగే, 28వ డివిజన్లోని దుర్గేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే నరేందర్ హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గందె కల్పన-నవీన్ దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ ఎలకంటి సతీశ్, డైరెక్టర్ కూచన రమేశ్ పాల్గొన్నారు.