మడికొండ, మే 25: పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు కష్టపడితేనే సర్కారు కొలువులు సొంతం అవుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నిర్వహించనున్న పోటీ పరీక్షల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువత రాణించాలనే లక్ష్యంతో కమిషనరేట్తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని బుధవారం సీపీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యువత ప్రణాళికాబద్ధంగా చదవాలని, దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగ్గట్లుగా సిలబస్లపై దృష్టి సారించాలని చెప్పారు. అనవసరమైన విషయాల కోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. కష్టమైన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఎకువ సమయాన్ని కేటాయించాలన్నారు.
ప్రభుత్వ కొలువులు సాధించాలంటే సెల్ఫోన్తో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదన్నారు. అనంతరం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్తో కలిసి సీపీ 50 మందికి రూ.2వేలు విలువైన స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో సీటీసీ ప్రిన్సిపాల్ రాగ్యానాయక్, వైస్ ప్రిన్సిపాల్ సాంబయ్య, ఇన్స్పెక్టర్ సీతారెడ్డి, శిక్షణ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.