టేకుమట్ల, మే 18 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చిన డాక్టర్ నవీన్ను అభినందించారు.
ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఉండేలా కృషి చేస్తానన్నారు. అనంతరం స్థానిక రైతువేదికలో 22 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 8 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 సంవత్సరాల్లో జరుగని అభివృద్ధి ఎనిమిదేళ్లలో సీఏం కేసీఆర్ చేసి చూపించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథకంలో పయనించాలంటే మరోసారి టీఆర్ఎస్కు అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
భూపాలపల్లిరూరల్ : భగవంతుడి దయ ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్కాలనీ రామాలయంలో హనుమాన్ స్వాములకు ఏర్పాటు చేసిన భిక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ.. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. 21న ఏర్పాటు చేసిన భిక్షకు హనుమాన్ భక్తులు, స్వాములు హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనంతరం గొల్లబుద్దారంలో హనుమాన్ భక్తుల మహాయాగంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన కానుగంటి కవిత తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లిలు చేయగా ఇద్దరికీ కల్యాణలక్ష్మి చెక్కులు, తన భర్త శ్రీనువాస్, కూతురు అనారోగ్యంతో చికిత్స చేయించుకోగా వారికి రూ.75 వేలు, రూ. 52వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా కవిత మట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేసిన సాయం మరువలేనిదన్నారు.
మరోసారి అధికారంలోకి వచ్చి మాలాంటి పేదలకు అండగా నిలవాలని కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం జీఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన క్రీడకారులకు (బూర్నపల్లి మొదటి, టేకుమట్ల రెండో, వెలిశాలకు మూడో బహుమతి) బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గునిగంటి మహేందర్, వైస్ ఎంపీపీ ఐలయ్య, సర్పంచ్లు పొలాల సరోత్తంరెడ్డి, శ్రీను, మహేశ్, ఉమేందర్, మహిపాల్రెడ్డి, స్వామిరావు, ఆది రఘు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.