జయశంకర్ భూపాలపల్లి మే 18 (నమస్తేతెలంగాణ) : భూపాలపల్లి మం డలం అటవి కమలాపూర్లోని సమ్మ క్క-సారలమ్మ గద్దెల సమీపంలో బుధ వారం పెద్దపులి సంచరించింది. గ్రామ స్తులు ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాం తంలో పరిశీలించి అవి పులి పాదముద్ర లేనని భూపాలపల్లి రేంజ్ ఆఫీసర్ నరేశ్ ధ్రువీకరించారు.
పెద్దపులి కమలా పూర్ అడవుల నుంచి ఆజంనగర్ ప్రాంతంలోని ఊట్లపల్లి వైపు వెళ్లినట్లు సమాచారం. పులి సంచరిస్తున్న క్రమంలో ప్రజలెవరూ అడవిలోకి వెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పులికి హాని తలపెట్టవద్దని ఆయన కోరారు. పులి జాడ కోసం ట్రాకింగ్ చేస్తున్నట్లు నరేశ్ వివరించారు..