ములుగురూరల్, ఆగస్టు 19 : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని, విద్యార్థులు పాఠశాల స్థాయిలో క్రీడల్లో రాణించి, క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని డీఈవో పాణిని సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని జాకారం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించారు. విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, తదితర క్రీడలను నిర్వహించారు.
తొమ్మిది మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 683 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొని ప్రతిభను చూపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో విద్యార్థులనుద్దేశించి మా ట్లాడారు. క్రీడల్లో గెలుపు, ఓటములను సమానం గా స్వీకరించాలన్నారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు ప్రసంసా పత్రాలతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ బీ సుదర్శన్రెడ్డి, సైన్స్ అధికారి జయదేవ్, ఎంఈవోలు శ్రీనివాస్, రాజేశ్, సాంబయ్య, సారయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాటారం: ప్రతి ఒక్కరూ విద్యార్థి దశలోనే సరియైన లక్ష్యాలను ఏర్పరుచుకొని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సా మ్యూల్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల్లో భాగం గా శుక్రవారం మం డల కేంద్రంలోని తిమోతి బాయ్స్ హోమ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అ నంతరం పిల్లలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారి రాధిక, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ, బాలల సంరక్షణ అధికారి రాజ కొమురయ్య, చైల్డ్ లీగల్ అధికారి మోహినొద్దీన్, ఎంపీవో మల్లికార్జున్రెడ్డి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సునీల్, ఏపీవో వెంకన్న, కుమార్ పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్ : క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని ఎంఈవో దేవానాయక్ సూచించారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భూపాలపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మండల స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి మండల విద్యాధికారి దేవానాయక్ హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ విద్యార్థులు ఒక గంట సేపు ఆటలు ఆడుకోవాలన్నారు. విద్యార్థులకు కబడ్డ్డీ, ఖోఖో, రన్నింగ్, లాంగ్ జంప్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు రాజయ్య, జయపాల్, జ్యోతి, సరస్వతి, రామ్థన్ పాల్గొన్నారు.
చిట్యాల: క్రీడలు మానసికోల్లాసాన్ని పెంపొందిస్తాయని జడ్పీటీసీ గొర్రెసాగర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు వజ్రోత్సవాల్లో భాగంగా మండల స్థాయిలో విద్యార్థులకు ఆటల పోటీలను జడ్పీటీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందిడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, ఎంఈవో కే రఘుపతి, ఎంపీటీసీ కట్కూరి పద్మానరేందర్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ రఘుపతి, తిరుమల్రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ అశోక్, ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.
భూపాలపల్లి టౌన్: మండలంలోని గుడాడ్పల్లిలో వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఉడుత లక్ష్మీ ఐలయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు క్రీడలు నిర్వహించగా, జడ్పీ వైస్ చైర్మన్ కే శోభ రఘుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ఉత్తమ కవి కళాకారులు కళ్లెపు రాజేశ్వర్రావు, సమ్మయ్యను గ్రామ సర్పంచ్ లక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ శోభ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మల్హర్: తాడిచర్ల జూనియర్ కళాశాల వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం రంగవల్లుల పోటీలు నిర్వహించారు. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు స్థానిక తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి దేవరాజ్ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థ్థునులు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థునులను దేవరాజు, అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలోఎన్ఎస్ఎస్ అధికారి రవీందర్, అధ్యాపకులు నరేందర్, రవి, జైపాల్, రమేశ్, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
గోవిందరావుపేట: మహనీయుల త్యాగాలు మరువలేనివని జడ్పీఎస్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుంజ రాజేశ్వర్ అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్, ప్రసాద్, సమ్మయ్య, మల్లయ్య, శ్యాంసుందర్రెడ్డి, రమాదేవి, సరిత, మురళీధర్, శ్రీదేవి, దీప్తి, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
చిట్యాల: స్వాతంత్ర వజ్రోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా చిట్యాల సివిల్ దవాఖానలో సుపరింటెండెంట్ జీడీ తిరుపతి రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్, ప్రవళిక, మాధవి తదితరులు పాల్గొన్నారు.
మహదేవపూర్: వజ్రోవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక దవాఖానలోని రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణీబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, ప్రభుత్వ దవాఖాన సూపరిండెంట్ చంద్రశేఖర్, ఎంపీడీవో ఎం శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహాముత్తారం: 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని పీహెచ్సీలోని రోగులకు ఎంపీడీవో రవీంద్రనాధ్, వైద్య సిబ్బం ది రోగులకు శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మమత, ఎంపీవో ఉపెంద్రయ్య, స్టాఫ్నర్స్ గీతాంజలి, ఫార్మసిస్ట్ భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, మల్లిఖార్జున్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి: వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ జయపాల్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది, ఉపాధ్యాయులున్నారు.
ములుగురూరల్ : వజ్రోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానలో రోగులకు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య, తహసీల్దార్ మధుర కవి సత్యనారాయణస్వామి, దావాఖాన సూపరింటెండెంట్ జగదీశ్వర్, ఎంపీడీవో ఎక్బాల్, ఎంపీవో హన్మంతరావు ఉన్నారు.
మంగపేట: వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం మంగపేట లోని కస్తూరీబాయి వృద్ధ్దాశ్రమంలో స్త్రీ, శిషు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్కుమార్ వృద్ధులకు పండ్లు, స్వీట్లు, బ్రెడ్, ఓఆర్ఎస్ పాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య దశలో ఉన్న వారిపై ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలన్నారు. వృద్ధులకు సేవలందిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు సామ్రాజ్యం-కేశవరావు దంపతులను అభినందించారు. వృద్ధ్దాశ్రమానికి స్థల కేటాయింపు చేయాలని ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు అధికారులను కోరారు. డీఆర్వో రమాదేవి, డీఆర్డీవో పద్మజ, డీడబ్ల్యూవో ప్రేమలత, సీడీపీవో హేమలత, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, ఎంపీవో శ్రీనివాస్, ఆర్ఐ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి హీరునాయక్, కస్తూరీ బాయి వృద్ధ్దాశ్రమ నిర్వాహకురాలు సామ్రాజ్యం, వర్తక సంఘం అధ్యక్షుడు కే కేశవరావు పాల్గొన్నారు.
గోవిందరావుపేట: వజ్రోత్సవాలను పురస్కరించుకుని మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అల్లం రాజ్కుమార్ వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీ మమత, ఆర్ఐ రాజేందర్, ఏఆర్ఐ సుధాకర్ పాల్గొన్నారు.